మహబూబాబాద్, ఫిబ్రవరి 7: ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిర్మాణాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్కుమార్కు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత వినతిపత్రం అందించారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి ఉపా ధి హామీ బిల్లులు చెల్లించేలా కృషి చేయాలని కోరారు.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద వైకుంఠధామాలు, రైతువేదికలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే పూర్తయినట్లు, అందుకు సంబంధించిన బిల్లులను సైతం చెల్లించినట్లు స్టేటస్లు ఉన్నాయని పేర్కొన్నారు. నిజానికి ఆయా నిర్మాణాలు పూర్తి కాలేద ని, సంబంధిత బిల్లుల చెల్లింపులు జరుగలేదని వివరించారు. తిరిగి సదరు నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఎంపీ వెంట జిల్లా సర్పంచుల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ నాయక్ ఉన్నారు.