కాశీబుగ్గ, సెప్టెంబర్ 16: గతంలో మోసం చేసిన పార్టీలను ప్రజలు మళ్లీ నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ సూచించారు. ఇటీవల అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పంట నష్టపరిహారం చెక్కులను శనివారం 3వ డివిజన్ కొత్తపేట రైతువేదికలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ బుద్దే శ్రీనివాస్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు గత పాలకులు సరైన విద్యుత్, సాగునీరు అందించకుండా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. రైతులకు పనుల్లేక పక్క రాష్ర్టాలకు వలస పేర్కొన్నారు.
పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్కు ప్రజలు రెండు సార్లు పట్టం కట్టారని చెప్పారు. రైతుల మేలు కోరి మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలో 45వేల చెరువులను మరమ్మతులు చేశారని, కాళేశ్వరంతో తెలంగాణ రైతులకు పూర్తి నీరు అందుతుందన్నారు. వరంగల్ మండలంలోని 279 మంది రైతులకు పంట నష్ట పరిహారం రూ.32లక్షల విలువైన చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు, గోదాంలు నిర్మిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ఎరువులు, విత్తనాలపై రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, రైతుబంధు క్లస్టర్ కోఆర్డినేటర్ నర్సింగుల సురేశ్ యాదవ్, నాయకులు బుద్దే వెంకన్న, బొచ్చు రాజు, పండుగ రవీందర్రెడ్డి, దయ్యాల వేణు, జన్ను లింగం కోటి, జన్ను స్వామిదాసు, జన్ను సారంగపాణి, ఇట్యాల సతీశ్, నాగవరపు సుధాకర్ పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
హసన్పర్తి : వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 66 డివిజన్లోని హసన్పర్తిలో నల్లగట్టు నుంచి సుభాశ్చంద్రబోస్ విగ్రహం వరకు, వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పాత మార్కెట్ వరకు రూ.కోటీ 10 లక్షల వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో విలీన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
స్థానిక కార్పొరేటర్ శివకుమార్, ఆత్మ చైర్మన్ చంద్రమోహన్, బీఆర్ఎస్ 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెటి ్టశ్రీధర్, యూత్ అధ్యక్షుడు వొల్లాల శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్రెడ్డి, డైరెక్టర్ కుమారస్వామి, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పిట్టల కమారస్వామి, దీకొండ భిక్షపతి, బోడ యుగేంధర్, మేకల రాజేందర్ పాల్గొన్నారు.