పోచమ్మమైదాన్, మార్చి 17: ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఆదివారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవాలని కోరారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఉల్లంఘనలు, సందేహాలు ఉంటే సంప్రదించాలని సూ చించారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే ముందు సంబంధిత ఏఆర్వో/ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి రూ.95 లక్షల ఖర్చు పరిమి తి ఉందని, ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తీసి, అందులో నుంచే ఖర్చు చేయాలన్నారు. ఎన్నికల ప్రచార అనుమతి కోసం కలెక్టరేట్లోని సువిధ సెల్కు కనీసం 72 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాస్, జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవరెడ్డి, ఆర్డీవో సిదం దత్తు, కృష్ణవేణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నామని, జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సామగ్రి ముద్రణను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు చేపట్టాలని జిల్లా ఉప ఎన్నికల అధికారి సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్లో ఆమె జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమీక్షించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్స్ ముద్రించేటప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణకర్తల పేర్లు, చిరునామా, ఫోన్ నంబర్లు ప్రింట్ లైన్పై స్పష్టంగా ఉండాలని ఆమె సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీకాంత్, ఎన్నికల పర్యవేక్షకులు విశ్వనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.