సుబేదారి, ఏప్రిల్ 5 : బండి సంజయ్ డైరెక్షన్లోనే పేపర్ లేకేజీ జరిగిందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ స్వార్థ రాజకీయాలతో విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమడుతోందని మండి పడ్డారు. కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహారంతోపాటు రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆపార్టీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. బుధవారం హనుమకొండ అదాలత్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తెలంగాణ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. అనంతరం చీఫ్విప్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషిచేస్తుంటే ఓర్వలేక అసత్య ప్రచారం చేయడానికి బండి సంజయ్ డైరెక్షన్లో ఆ పార్టీ నాయకులు పేపర్ లీకేజీ కుట్రలకు తెరలేపారన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
బీజేపీ కుట్ర పూరితంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా లేని లీకేజీలు ఇప్పుడే ఎందుకు బయటికి వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో లబ్ధి పొందడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం ఛేదించిందని, లీకేజీలకు పాల్పడిన వారందరూ బీజేపీ నాయకులేనన్నారు. ఎన్ని కుట్రలు, తప్పుడు ప్రచారం చేసినా కేసీఆర్ ప్రభుత్వానికి ఏమి జరగదన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్రావు, నర్సింగ్, రాజు, బీఆర్ఎస్ నాయకులు కేశవరావు, వీరేందర్, జోరిక రమేశ్, ప్రశాంత్, సుమన్, నాగరాజు, పరశురాములు కేశవరెడ్డి, సుగుణాకర్రెడ్డి పాల్గొన్నారు.