కాశీబుగ్గ, జూన్ 3 : కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రైతు దినోత్సవం నిర్వహించారు. తొలుత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో నిత్యం కరంట్ కోతలతో వ్యవసాయ మోటార్లు కాలిపోయేవని, కనీసం ఐదు గంటల కూడా సరఫరా చేయలేని పరిస్థితి అని గుర్తుచేశారు. బోర్లు కూడా పడని నేలలో కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. దేశంలోనే 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఒకప్పుడు 2.20లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే, ఇప్పుడు జిల్లాలో 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతు బంధు కింద రైతులకు రూ.57,801 కోట్లు అందించినట్లు తెలిపారు. అలాగే రూ.4,339 కోట్ల రైతు బీమా ఇచ్చినట్లు చెప్పారు.
రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రూ.13కోట్లతో 59 రైతు వేదికలను నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో రైతులు గుర్తు చేసుకోవాలన్నారు. జూన్ 15 లోపు అలాగే నవంబల్ 10లోపు తప్పనిసరిగా నాట్లు వేసుకుంటే అకాల వర్షం వల్ల పంట నష్టం జరుగదన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ.. సాగునీటి వనరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పండి న పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో ముందు వరుసలో ఉన్నట్లు తెలిపారు. తొందర్లోనే పత్తి, స్పైసెస్ రీసెర్చ్ సెంటర్, వెజిటెబుల్, ఫ్రూట్స్ మార్కెట్, ఫిష్ మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి యావత్ భారత్ తెలంగాణ వైపు చూస్తోందన్నారు. రైతుల ఇంట్లో సంతోషం నింపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రం ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే రైతులు, కార్మిక వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తొందర్లోనే బస్తీ దవాఖాన ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్మికులకు లేబర్కార్డులు అందిస్తానని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తానని చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్సించాలన్నారు.
సీపీ మా ట్లాడుతూ.. రైతులకు ఎవరైనా నష్టం కలిగించినట్లు తమ దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2014 కంటే ముందు జిల్లాలో 1,72,800 ఎకరాల్లో పంటలు సాగవ్వగా, ఇప్పుడు 3లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. 78,560 ఎకరాలకు అప్పుడు సాగు నీరు అందితే, ఇప్పుడు 2,11,650 ఎకరాలకు దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందుతున్నదన్నారు. వరి ధాన్యం గతంలో 83,294 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 3.34లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందన్నారు. రూ.60 కోట్లతో మార్కెట్లో సౌకర్యాలను మెరు గు పరిచినట్లు తెలిపారు. అనంతరం 20 మంది రైతులను సత్కరించారు.
అలాగే, అన్నదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాకుమార్ యాద వ్, కార్పొరేటర్ తూర్పాటి సులోచన, దిడ్డి కుమారస్వామి, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఈట్యాల హరికృష్ణ, చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు కటకం పెంటయ్య, జేడీఎం ఎన్నారపు మల్లేశం, డీడీఎం అజ్మీరా రాజునాయక్, డీఎంవో పాలకుర్తి ప్రసాద్రావు, మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్ రాహుల్ పాల్గొన్నారు.
సంగెం : తెలంగాణకు కేసీఆర్ సీఎం కావడం మనందరి అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. గవిచర్ల రైతువేదికలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాలు తెలిసిన వ్యక్తి కావడం వల్లే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గ్రామాలను సస్యశ్యామలం చేశారన్నారు. రైతుల మేలుకోరి ధాన్యం, మక్కలను కొనుగోలు చేయిస్తున్నారని తెలిపారు. రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. తన రాజకీయ జీవితానికి సాయం చేసిన సంగెం మండల ప్రజల కు రుణపడి ఉంటానన్నారు. అలాగే, మండలంలోని ఐదు రైతువేదికల్లో రైతు దినోత్సవం నిర్వహించారు. రైతు వేదికలను లైట్లు, పూలతో ముస్తాబు చేశారు. ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, తహసీల్దా ర్, రాజేశ్వర్రావు, ఎస్సై భరత్, వైస్ఎంపీపీ బుక్క మల్ల య్య, ఏవో చట్ల యాకయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, సర్పంచ్లు దొనికెల రమ, బాబు, గూడ కుమారస్వామి, కర్జుగుత్త రమ, ఎంపీటీసీలు మెట్టుపల్లి మల్లయ్య, సంపత్రెడ్డి, కొనకటి రాణి, రంగరాజు నర్సింహస్వామి, సుతారి బాలకృష్ణ, ఏఈవోలు సమత, సాగర్, అఖిల్, రాజేందర్ పాల్గొన్నారు.