ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. వానకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులు, వాటి లక్షణాలపై అవగాహన కలిగి ఉంటే వాటి నుంచి బయటపడవచ్చని జాగ్రత్తలు సూచించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకుగాను దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించిఆయిల్బాల్స్ తయారు చేసి వాటిని నీటి గుంటల్లో వదులుతున్నారు.
ప్రజలు వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు, సిబ్బంది అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వానకాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వ్యాధులు ప్రబలే ముప్పు పొంచి ఉందని వైద్య సిబ్బంది నివారణ చర్యలు చేపట్టారు. సాధారణ జ్వరం, జలుబు.. సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిములతో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవశరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిసాయ్తి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. జ్వరంతో పాటు కొంతమందికి దగ్గు, కీళ్లనొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం మూడు నుంచి వారం వరకు ఉంటుంది.
చికున్గున్యా జ్వరం దోమకాటుతో వస్తుంది. ఇది ఎడిస్ అనే దోమతో వ్యాప్తి చెందుతుంది. తలనొప్పి, వాంతులు, వికారంతో పాటు హఠాత్తుగా జ్వరం వస్తుంది. చేతి వేళ్లు, కాళ్ల నుంచి మొదలు శరీరంలోని అన్ని కీళ్లను బాధిస్తుంది. సరిగ్గా నిలబడలేని పరిస్థితి. జ్వరం తగ్గినా నొప్పులు ఎక్కువ కాలం ఉంటాయి. చికున్ గున్యా సోకితే మొదటి రెండు, మూడ్రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఎడిస్ అనే దోమలు అధికంగా ఇంటి పరిసరాలోన్లే ఉంటాయి. పాత్రలు, ప్లాస్టిక్ వ సువుల్తు ,పూలకుండీలు, డ్రమ్ములు, టైర్లు, ఎయిర్ కూలరు,్ల చెట్టుతొర్రలో అధికంగా ఉంటాయి.
ఆడ అనాఫిలిస్ అనే దోమ కుటడ్టంతో మలేరియా సోకుతుంది. మలేరియా రోగిని దోమ కుట్టి రక్తం పీల్చినప్పుడు రోగ కారకమైన పరాన్నజీవి దాని కడుపు లోంచి ప్రవేశించి పెరు గుతుంది. ఆ దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు పరాన్నజీవి ఆ వ్యక్తి రక్తంలోకి చేరి వ్యాధి సంక్రమింపజేస్తుంది. మలేరియా వ్యాధి నాలుగు రకాలుగా ఉంటుంది. ప్లాస్మోడియం వివక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఓవలే. చివరి రెండు రకాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
వానకాలంలో హైపటైటిస్- ఏ(కామెర్లు) వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాలేయ కణాల్లో సంక్రమణతో కలుగుతుంది. ఈ వ్యాధి సూక్ష్మక్రిములు కలుషితమైన ఆహార పదార్థాలు, తాగునీటి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ వ్యాధి కారణంగా బైలురుబిన్ పరిమాణం పెరుగుతుంది. ఈ కారణంగా శరీర భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి.
మెదడు వాపు వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా అక్టోబర్, నవంబర్ మాసాల్లోనాలుగు నుంచి 12ఏండ్ల లోపు వయసున్న పిల్లల్లో వస్తుంది. హఠాత్తుగా జ్వరంతో కూడిన ఈ వ్యాధి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. పంట పొలాల్లోని నీటిలో ఈ దోమ నివసిస్తుంది.
సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిములతో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిసాయ్తి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. జ్వరంతో పాటు కొంతమందికి దగ్గు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం మూడు నుంచి వారం వరకు ఉంటుంది.
ప్రజలు వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు, సిబ్బంది అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వానకాలంలో డెంగీ, మలే రియా, టైఫాయిడ్, ఇతర వ్యాధులు ప్రబలే ముప్పు పొంచి ఉందని వైద్య సిబ్బంది నివారణ చర్యలు చేపట్టింది. సాధారణ జ్వరం, జలుబు.. సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిములతో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవశరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిసాయ్తి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. జ్వరంతో పాటు కొంత మందికి దగ్గు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం మూడు నుంచి వారం వరకు ఉంటుంది.
గతేడాది కంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యాధుల శాతం గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంతో పరిసరాలు పరిశుభ్రంగా మారి వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. అయినా వ్యాధుల సీజన్ ప్రారంభమైంది కాబట్టి వైద్య బృందం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టాం. ముందుజాగ్రత్తలతోనే వ్యాధులను అరికట్టాలని సూచిస్తూ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.
– శ్రీరాం, డీఎంహెచ్వో, భూపాలపల్లి
వరక్షాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇది సాల్మోనెల్లాటైపీ బాక్టీరియాతో వస్తుంది. కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తినడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
వైరల్ ఫీవర్ మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. పగలు కుట్టే ఎడిస్ అనే దోమలతో వస్తుంది. ఇది ఒక సాధారణ వైరస్ జ్వరం. తగ్గినట్టే అని పించి వారం, పది రోజుల్లో మళ్లీ తిరగ బెడుతుంది. తలనొప్పి, ఒంటి నొప్పి, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావంతో కాళు,్ల చేతులు, ముఖం, వీపు, ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్లు చిన్న చిన్న కురుపులు కనిపిస్తాయి. కండ్లనొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు, జ్వరం లక్షణాలు ఉంటాయి.
పైలేరియా క్యూలెక్స్ దోమతో వ్యాప్తి చెంది ఎవరికైనా సోకే ప్రమాదముంటుంది. తరచూ వచ్చే జ్వరం, సంకలు, గజ్జల్లో బిల్లలు కట్టడం, వెదురు పాముతో మొదలై క్రమేణా అవ యవాల వాపునకు దారితీస్తుంది. ప్రత్యేకించి కాళ్లు, చేతులు, వరబీజం, జ్ఞానేంద్రియాలు పాడవ్వడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
వానకాలంలో విషజ్వరాలు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి శుక్రవారం డ్రై డే పేరుతో పలు రకాల కార్యక్రమాలు చేప డు తు న్నారు. నిల్వ ఉన్న నీటిని తొలగించడం, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పల్లె, పట్టణ ప్రగతితో వ్యాధులు తగ్గుముఖం చల్లటి గాలలు, గాలిలో తేమతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. తడి వాతావరణం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. వాటర్ లాగింగ్, ధూళి కారణంగా దోమ లు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా పుడుతాయి. నీరు, గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. ఇది జ్వరం, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ఇళ్లలో తేమ పెరగడంతో నల్ల ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. నల్ల ఫంగస్ వేసవిలో జన్మించినప్పటికీ, వర్షంతో వచ్చే తేమలో ఇది వేగంగా వ్యాపిస్తుంది. వర్షంలో సంభవించే వ్యాధులు, వాటిని నివారించే మార్గాలు తెలుసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాధులు, లక్షణాలు, జాగ్రత్తలపై అవగాహన అవసరం. వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో ఇటు పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత కారణంగా వ్యాధుల శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
ఫంగస్ గాలిలో ఉంటుంది. రొట్టెపై బూజు, చెట్ల కొమ్మలపై నలుపు రూపంలో చూస్తుంటాం. ఈ ఫంగస్ ముక్కు ద్వారా శ్లేష్యంతో కలిసి ముక్కు చర్మంలోకి వెళ్తుంది. తర్వాత ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. మెదడుకు వెళ్తుంది. దీని మరణాల రేటు 50శాతం. కాబట్టి ఫంగస్ విషయంలో జాగ్రత్తపడాలి.