జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వత్రా సంబురాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న జేపీఎస్ల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి హర్షం వ్యక్తంచేసి థాంక్యూ సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
జేపీఎస్ల పనితీరు మదింపుపై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని, త్వరలో విధివిధానాలు ఖరారు చేయాలని సూచించడంపై సంతోషం వ్యక్తంచేశారు. తమ సమస్యలను పరిష్కరించి తమ జీవితాల్లో వెలుగునింపినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 23