ప్రాజెక్టుపై కేంద్రం ఆంక్షలు సరికాదు
ఇప్పటికే అనుమతి పత్రాలను కేంద్రానికి సమర్పించాం
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పాకాల మత్తడి వద్ద ప్రత్యేక పూజలు
ఖానాపురం, జూలై 14 : నర్సంపేట నియోజకవర్గ రైతుల పాలిట కల్పతరువైన పాకాల రామప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తక్షణమే అనుమతులున్న జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. పాకాల చెరువు మత్తడి పోస్తుండడంతో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో పాకా ల రామప్ప ప్రాజెక్టు నిర్మించుకున్నామన్నారు. ట్రయ ల్ రన్ సైతం చేశామన్నారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దశలో కేంద్రం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి పాకాలను అనుమతులు లేని జాబితాలో చేర్చి రాష్ట్ర హక్కులను హరించిందని వి మర్శించారు. గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుంటున్నదని, అందుకే ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులివ్వ డం లేదన్నారు. రాబోయే రోజుల్లో పాకాల తైబందీని సైతం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతి పత్రాలను 6 నెలల క్రితమే కేంద్రానికి సమర్పించిననప్పటికీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం అనుమతులు ఇవ్వాలని, లేకపోతే రైతుల తరుఫున మరో పోరాటానికి సిద్ధమవుతామన్నారు.
నాట్లు వేసుకోవాలి..
వరుణదేవుడు కరుణించడంతో 30 ఏళ్లలో జూలై 14న పాకాల చెరువు మత్తడి పడడం ఇదే ప్రథమమన్నారు. దీంతో ఆయకట్టు రైతులు 2 పంటలను పం డించుకోవచ్చన్నారు. అలాగే, పంట కాల్వల శాశ్వత మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.160 కోట్లు మంజూరు చేసిందన్నారు. రైతులు ముందస్తుగా నాట్లను వేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో చివరిగా ధాన్యం వచ్చేది పాకాల ఆయకట్టునుంచేనని, దీంతో రైతులకు వడ్ల కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండ ల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్రెడ్డి, సర్పంచ్ గొర్రె కవిత, రవి, భాషబోయిన ఐలయ్య, బూస అశోక్, గుంటి కిషన్, మునిగాల వెంకట్రెడ్డి, యాదగిరి, బొప్పిడి పూర్ణచందర్, తిరుపతిరెడ్డి, బండి వెంక న్న, రాంబాబు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
పాకాలకు జలకళ..
పాకాల సరస్సు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకుంది. చెరువు నీటిమట్టం 30.2 అడుగులు కాగా, పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకుతున్నది. జూలైలోనే మత్తడి పోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలకు ఢోకా ఉండదని సంబురపడుతున్నారు. పాకాల మత్తడి పోస్తుండడంతో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.