పంటల సాగులో కొత్త విధానాన్ని అనుసరించి లాభాలు గడిస్తోంది తొర్రూరుకు చెందిన మంగళపెల్లి నీలిమ. సర్కారు సాయం.. ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహంతో ఒక ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటుచేసింది. తొలుత క్యాప్సికం, కీరదోస సాగుచేసినా ఎక్కువ పెట్టుబడి, తక్కువ దిగుబడి, మార్కెటింగ్ సమస్య కారణంగా నష్టాల్ని చవిచూసింది. అయినా కుంగిపోకుండా స్థానికంగా గిట్టుబాటయ్యే కూరగాయలే పండించాలని నిర్ణయించుకొని భర్త కృష్ణమూర్తి సహకారంతో సేంద్రియ సాగువైపు అడుగులేసింది. పాలకూర, మెంతి, గంగవాయిలి, తోటకూర, బచ్చలి, చుకకూర వంటి ఆకుకూరలు పండిస్తూ లాభాలు పొందడమే కాకుండా పది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. వ్యవసాయంలో ఆమె చేస్తున్న కృషికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ సైతం దక్కించుకొని రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.
తొర్రూరు, డిసెంబర్ 17 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన దళిత రైతు మంగళపెల్లి నీలిమ ఫత్తేపురం శివారులో ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఉద్యాన శాఖ సహకారంతో 2019లో ఎకరంలో పాలిహౌస్ ఏర్పాటుచేశారు. అందులో మొదట క్యాప్సికం, కీరదోస సాగుచేశారు. వాటికి పెట్టుబడి ఎకువ, దిగుబడి సరిగా రాకపోవడం, పైగా దిగుబడిని డిమాండ్కు తగ్గట్టుగా అమ్ముకోవాలంటే హైదరాబాద్ మారెట్ కు వెళ్లాల్సి రావడంతో నష్టాలను చవిచూశారు. పండించిన ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోవడం, నిత్యం వ్యయప్రయాసాలకు ఓర్చుకోవడం నుంచి లాభసాటిగా ఉన్న చోటనే డబ్బులు సంపాదించాలనే విభిన్నమైన కోణంలో ఆలోచించి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఫలితంగా మూడేళ్ల నుంచి పాలీహౌస్లో వినూత్న ప్రయోగాలు చేస్తూ లాభాల బాట పట్టారు. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ నుంచి 2021లో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళా రైతుగా గుర్తించి ఏడాది క్రితం అప్పటి సుప్రీంకోర్టు జడ్డి హిమాకోహ్లి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. తొర్రూరులో సేంద్రియ ఆకుకూరల విక్రయ కేంద్రాన్ని నిర్వహిస్తూ తాను లాభాలు గడిస్తూ పది మంది కూలీలకు జీవనోపాధి కల్పిస్తున్నారు.
ఆకుకూరలైతే ఆరోగ్యానికి మంచిదని, మరీ ముఖ్యంగా గర్భిణులు, మహిళలు, బాలికలతో పాటు ఎకువ మంది వాటిని తినడానికి ఇష్టపడతారని ఆ దిశగా సాగుకు సన్నద్ధమయ్యారు. సేంద్రియంలో ఆకుకూరల సాగుతోనే లాభాలు గడించొచ్చని గ్రహించి పాలీహౌస్లోనే పాలకూర, మెంతి, గంగవాయిలి, తోటకూర, బచ్చలి, చుకకూర వంటి ఆకుకూరలు పండించడం మొదలుపెట్టారు. తాను పండించిన ఆకుకూరలు సుమారు నాలుగు రోజులైనా పాడవకుండా నిల్వ ఉంచుకోవచ్చని, సహజసిద్ధంగా సాగు జరగడంతో ఆకుకూరల రుచి కూడా బాగుంటుందనే అభిప్రాయాన్ని అందిరికీ కలిగించారు. దీంతో సాగుక్షేత్రానికే డాక్టర్లు, వ్యాపారులు, టీచర్లు, ఎకువ సంఖ్యలో ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సహజసిద్ధంగా కూరలను పండిస్తూ పలువురి మన్ననలు పొందడమే కాకుండా సేంద్రియంలో చిటాలు పంచుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
నీలిమ మొదట ఏమీ చదువలేదు. కానీ పెళ్లి అయిన తర్వాత భర్త కృష్ణమూర్తి సహకారంతో పట్టుదలతో చదువుకుని పదో తరగతి పాస్ అయి ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నారు. అలాగే, కేసీఆర్ సరారు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి వీ హబ్ ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కూడా నీలిమ గత సంవత్సరం పూర్తి చేశారు.
నీలిమ జిల్లా ఉద్యానశాఖ వారితో ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విద్యాన్ ప్రతిష్ట, కేవీకే రైతు మిత్ర ఫౌండేషన్ వారి నుంచి పుడమి పుత్ర రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు అవార్డు స్వీకరించారు. ఎస్వీఎస్ సహాయక వేదిక వారి నుంచి భూమిరత్న రాష్ట్రస్థాయి అవార్డును కూడా పొందారు. అవీ కాకుండా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్థ వారు ఇటీవల హైదరాబాద్లో మెడికవర్ హాస్పిటల్ వారితో కలిసి వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరుస్తున్న 11మంది మహిళలను గుర్తించి సత్కరించారు. వ్యవసాయరంగంలో తెలంగాణలోనే ఉత్తమ మహిళా రైతుగా ఏడాది క్రితం అప్పటి సుప్రీంకోర్టు జడ్జి హిమా కోహ్లీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
భూసారం పెంచడానికి నీలిమ తనవంతుగా కొత్త పంథాను ఎంచుకున్నారు. భూసారం కోసం జీవామృతం, ఘన జీవామృతం, వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు వాడుతున్నారు. ఆవుమూత్రం, పేడ, కషాయం, ఐతాకుల కషాయం, మట్టి ద్రావణం మొదలైనవి వాడుతూ సాగును చేస్తున్నారు. అలాగే భూమిలో సారం పూర్తిగా దహించుకుపోకుండా సంవత్సరానికి ఆరు నుంచి 8 నెలలు ఆకుకూరలు పండిస్తూ, బయట ఆకుకూరలు (సేంద్రియం కాని పంట) వచ్చే సమయంలో సుమారు నాలుగు నెలలు భూమిని ఖాళీగా ఉంచుతూ కొత్త టెక్నిక్ను ఫాలో అవుతున్నారు. ఎకరం నేలలో 125 ట్రాక్టర్ ట్రిప్పుల ఎరువు (ఆవు పేడతో సహజ సిద్ధంగా తయారు చేసిన) వేసి భూసారాన్ని పెంచి విత్తనం వేసి మొలక వచ్చిన 15రోజుల లోపు వేప కషాయం, ఆవుమూత్రంతో తయారు చేసిన జీవామృతం స్ప్రే చేస్తూ తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. స్వతహాగా తయారు చేసుకున్న రెయిన్ పైప్ ద్వారా నీటిని తగిన రీతిలో అందిస్తూ నిత్యం ఆరుగురు శ్రమించి ఎలాంటి కలుపు రాకుండా, పురుగుమందులు వాడకుండా కూరగాయల సాగుచేస్తున్నారు.
ప్రతిరోజు క్వింటాల్ చొప్పున నెలలో 20 రోజులు ఆకుకూరలను కట్ చేసి అమ్ముతారు. క్వింటాల్కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఆదాయం వస్తున్నది. తన పాలీహౌస్లో రోజుకు ఆరుగురి కూలీలు పనిచేస్తారు. దున్నడానికి, విత్తనానికి, కూలీల ఖ ర్చులన్నీ పోగా నెలకు సుమారు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు లాభవం వస్తోందని ఆనందంగా చెబుతున్నారు నీలిమ.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మరిన్ని ఉన్నతమైన చదువులు చదివి వ్యాపారవేత్తగా ఎదగాలనేది తన చిరకాల కోరిక అని నీలిమ చెబుతున్నారు. చిన్నప్పుడు అస్సలే చదువు లేని కారణంగా మొదట్లో చదువు కోవడం అంటే కాస్త ఇబ్బందిగానే అనిపించిందని, భర్త ప్రోత్సాహంతో రాణించగలుగుతున్నానన్నారు. ఎందరో గొప్పగొప్ప వ్యక్తులు తమ ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ మంత్రాన్ని పొందారని వాళ్లే తనకు ఆదర్శమని ఈ సందర్భంగా నీలిమ తన ఆకాంక్షను పంచుకున్నారు.