హనుమకొండ చౌరస్తా, మే 30 : ఓపెన్ సూల్, ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,357 మంది అభ్యర్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరు కాగా 2,792 (83.17 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ సూల్ కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.72 శాతంతో రాష్ట్రంలో 2వ, మహబూబాబాద్ 91.72 శాతంతో 3వ, ములుగు 90.62 శాతంతో 5వ, హనుమకొం డ 89.04 శాతంతో 7వ స్థానంలో నిలువగా, జనగామ 79.46 శా తం, వరంగల్ 60.39 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అలా గే 6,568 మంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కాగా 5,174 (76.78 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
ములుగు జిల్లా 81.66 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా, జయశంకర్ భూపాలపల్లి 81.51 శాతంతో 3వ, హనుమకొండ 80.66 శాతంతో 6వ, జనగామ 79.11 శాతంతో 8వ, మహబూబాబాద్ 79.06 శాతంతో 9వ స్థానం సాధించగా, వరంగల్ 69.62 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 2 నుంచి 7 వరకు www.telanganaopenschool.org లేదా Mee-Seva ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇంటర్మీడియట్ రీకౌంటింగ్కు రూ.400, ఎస్సెస్సీకి రూ.350 ఫీజు చెల్లించాలన్నారు. అలాగే రీ వెరిఫికేషన్ కోసం ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్కు రూ.1200 చెల్లించాల్సి ఉంటుందని, ఇతర వివరాలకు 9346020003 నంబర్లో సంప్రదించాలని సదానందం కోరారు.