నెక్కొండ : రైతులకు నాణ్యమైన విత్తనాలను( Quality seeds ) మాత్రమే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల ( Vijayanirmala ) అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని పలు విత్తన,ఎరువులు, పురుగు మందుల షాపులను ఆమె సోమవారం తనిఖీ చేశారు. తనిఖీల్లో పలు షాపులలో విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిస్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించారు.
రైతులకు కంది విత్తనాలను అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తన కొనుగోలు సమయంలో విధిగా రశీదును ఇవ్వాలన్నారు . గడువు తీరిన పురుగుమందులను చట్ట ప్రకారం ప్రత్యేకంగా నిల్వచేయాలని, ఎరువుల నిల్వలను ఈ పాస్ యంత్రం స్టాక్ రిజిస్టర్ లో వ్యత్యాసం లేకుండా నమోదు చేయాలని సూచించారు. తనిఖీ లలో మండల వ్యవసాయ అధికారి ఏ. నాగరాజు పాల్గొన్నారు.