వరంగల్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షంతో వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటల సర్వేను అధికారులు పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వారీగా పంట నష్టాన్ని నమోదు చేశారు. రైతులు ఏ సర్వే నంబర్లోని భూమిలో ఎంత పంట కోల్పోయారు అనే వివరాలు సేకరించారు. గత నెల 18, 19 తేదీల్లో కురిసిన వర్షానికి సుమారు 69 వేల ఎకరాల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు, వ్యవసాయశాఖ అధికారులు సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇది పూర్తయితే ప్రభుత్వానికి జిల్లా నుంచి పంట నష్టంపై సర్వే నివేదిక అందనుంది. ఈ జాబితాలోని రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం పంపిణీ మొదలు కానుంది.
అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల సర్వే పూర్తయింది. అధికా రులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వారీగా పంట నష్టాన్ని నమోదు చేశారు. ఆయా రైతులు ఏ సర్వే నంబర్లోని భూమిలో పంటను ఎంత విస్తీర్ణంలో కో ల్పోయారు అనేది సేకరించారు. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసేందుకు ప్రస్తుతం వివరాలను ఆన్లై న్లో నమోదు చేస్తున్నారు. గత మార్చి 18, 19 తేదీ ల్లో కురిసిన అకాల వర్షానికి వరంగల్ జిల్లాలో పంట లకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. 249 గ్రామాల్లో అకాల వర్షం ప్రభావం చూపినట్లు అధికా రులు గుర్తించారు. సుమారు 69 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎక్కువ విస్తీర్ణంలో మక్కజొన్న పంట దెబ్బతింది. దాదాపు 54 వేల ఎకరాల్లో మక్క జొన్న పంటకు నష్టం కలిగినట్లు అధికారులు ప్రాథమి క నివేదికలో పేర్కొన్నారు.
ఆ తర్వాత 12 వేల ఎక రాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మరో మూడు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మామి డి, మిరప, అరటి, డ్రాగన్ ఫ్రూట్స్ తోటలతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం పంట నష్టంపై సర్వేకు ఆదేశించింది. మార్గ దర్శకాలను జారీ చేయడంతో మార్చి 22 నుంచి అధి కారులు సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో రైతు పక్షపాతిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అకాల వర్షం కారణంగా పంట కో ల్పోయిన రైతులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు మార్చి 23న జిల్లాలో పర్యటించారు. దుగ్గొండి మండలంలో ని అడవిరంగాపురం గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న పంటలను మండుటెండల్లో కలియ తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంట నష్టంపై స్వయంగా బాధిత రైతులతోనూ మాట్లాడారు. ధైర్యాన్ని కోల్పోవ ద్దని, అండగా ఉంటానని సీఎం కేసీఆర్ రైతులకు భరో సా ఇచ్చారు. సర్వే జరిపి పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని అంది స్తామని ప్రకటించారు. ఈ పరిహారాన్ని కూడా సాధ్య మైనంత త్వరలో పంపిణీ చేస్తామని చెప్పడంతో బాధి త రైతులు సంతోషం వెలిబుచ్చారు.
యుద్ధప్రాతిపదికన సర్వే
సీఎం కేసీఆర్ పర్యటనతో అధికారులు జిల్లాలో పంట నష్టంపై సర్వేను వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన సర్వే నిర్వహించారు. గ్రామ స్థాయి బృందంలో వ్యవసాయ విస్తరణ అధికా రి(ఏఈవో), గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ పనిచేశారు. మండల స్థాయి బృందంలో మండల వ్య వసాయ అధికారి(ఎంఏవో), తాసిల్దార్, మండల పం చాయతీ అధికారి పంట నష్టాల సర్వేను పర్యవేక్షించా రు. జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య ఎప్పటికప్పుడూ పంట నష్టం సర్వేపై సమీక్ష చేస్తూ సూచనలు చేశారు. అను కున్నట్లుగానే అధికారులు పంట నష్టంపై సర్వేను పూర్తి చేశారు. ఆయా గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీ లించి రైతు వారీగా ఏ సర్వే నంబర్ భూమిలో ఎంత విస్తీర్ణంలో పంటకు నష్టం జరిగిందనే వివరాలను నమోదు చేశారు. దీంతో ఒక్కో రైతు ఏ సర్వే నంబర్ భూమిలో ఎంత పంటను కోల్పోయాడు?, మొత్తం ఎంత విస్తీర్ణంలో అతనికి పంట నష్టం జరిగింది? అనే ది తేలింది.
ఇలా సమగ్ర సర్వే జరుగడంతో జిల్లాలో అకాల వర్షం వల్ల ఎంత విస్తీర్ణంలో పంటకు నష్టం వా టిల్లింది?, అందులో ఏ పంటది ఎంత విస్తీర్ణం? అనే ది కూడా వెల్లడైంది. ప్రాథమిక అంచనా ప్రకారం సు మారు 69 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగిన ట్లు క్షేత్రస్థాయి సర్వేలో తేలినట్లు సమాచారం. బాధిత రైతుల సంఖ్య మాత్రం ప్రాథమిక అంచనా కంటే ఎ క్కువగా ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలి సింది. సర్వే పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రత్యేక బృం దాలు, వ్యవసాయశాఖ అధికారులు వివరాలను ఆన్ లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. ఇది పూర్తయితే ప్రభుత్వా నికి జిల్లా నుంచి పంట నష్టంపై సర్వే నివేదిక అంద నుంది. ఈ జాబితాలోని రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పంట నష్ట పరిహారం పంపిణీ మొదలు కానుంది. పంట నష్టాలపై సర్వే పూర్తయిందని, వివరా లను ఆన్లైన్లో ఎంట్రీ చేసే పని జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ తెలిపారు. ఆన్లైన్లో ఎంట్రీ చేయడం కొద్ది రోజుల్లో పూర్తి కానుందని ఆమె చెప్పారు.