కరీమాబాద్, జనవరి 23: ఖిలావరంగల్ మండల పరిధి రంగశాయిపేటలోని పుల్లాయకుంట 140, 142 సర్వే నంబర్లలో బీఆర్ఎస్ పార్టీకి అధికారులు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైంది. ఈమేరకు సామాజిక కార్యకర్త ఫసీ, చెరువుల రక్షణ కమిటీ నాయకుడు పెరుమాండ్ల లక్ష్మణ్ ఆరోపించారు.
మంగళవారం స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ ఆ స్థలాన్ని గత ఏడాది బీఆర్ఎస్ పార్టీకి కేటాయించగా, అందులో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయం నిర్మించేందుకు మే 2023లో భూమిపూజ సైతం చేశారని తెలిపారు. ఆ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని వారు ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టి స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరారు. స్థలం ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.