సుబేదారి, డిసెంబర్ 20 : గ్రేటర్ వరంగల్లో మరో కొత్త పోలీస్స్టేషన్ అందుబాటులోకి రానున్నది. 14వ డివిజన్లోని ఎనుమాములలో అన్ని హంగులతో సిద్ధమైన ఈ ఠాణాను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించనున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీపీ ఏవీ రంగనాథ్, డీసీపీలు, ఏసీపీలు పాల్గొననున్నారు. ఇది కమిషనరేట్లో 46వ పోలీస్స్టేషన్ కాగా , ఇప్పటికే ఈ ఠాణాకు సీఐ, సిబ్బందిని నియమించారు.
ఎకరంలో శ్రీగంధం సాగుచేస్తున్నా
వ్యవసాయంలో సాగు ఖర్చులు పెరిగినందున ఏ పంట వేసిన సరైన దిగుబడి రాకపోవడంతో నష్టపోయేది. అందుకే శ్రీ గంధం మొక్కల పెంపకం వల్ల లాభాలు వస్తాయని తెలుసుకున్నా.15-20 ఏళ్ల మధ్య పంట కోతకు వస్తుంది. శ్రీగంధం దీర్ఘకాలిక పంట అయినా దీని వల్ల లాభాలుంటాయి. భవిష్యతులో పిల్లలకు ఉపయోగపడుతుందని ఈ సాగును ఎంచుకున్నా. 2016లో ఎకరం భూమిలో 400 మొక్కలు నాటాను. వంద మొక్కలు దక్కలేదు, ప్రస్తుతం 300 మొక్కలు ఉన్నాయి. మధ్యలో ఎర్రచందనం, అగర్ వుడ్ మొక్కలు నాటాను.
– దూడ రమేశ్, రైతు, శనిగరం
సిరులు
శ్రీగంధం సాగు చేయడం వల్ల ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంది. 14ఏళ్లు దాటితే చెట్టులో చేవ (షాగ) అభివృద్ధి చెంది ఆయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పంట అయిన శ్రీగంధం సాగుచేసే రైతులు అంతర పంటలు వేసుకుని ఆదాయం పొందవచ్చు. ఈ మొక్కలు నేరుగా ఆహారం తీసుకోవు కాబట్టి ఇతర మొక్కలు పెంచడం వల్ల వేర్లు కలిసిపోయి వాటి ద్వారా ఆహారం తీసుకుంటాయి. సుగంధ ద్రవ్యాల మొక్క కావడం వల్ల ఆయిల్కు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. కాస్మోటిక్స్, మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శ్రీగంధం మార్కెట్కు ఎలాంటి ఇబ్బందులు లేవు.
మైసూరు, బెంగళూరులో కంపెనీలు ఉన్నాయి. వారికి సమాచారం ఇస్తే వారే వచ్చి చూసుకుని కొనుగోలు చేస్తారు. మార్కెట్లో కిలో శ్రీగంధం రూ.10వేలు పలుకుతుంది. ఒక్కో చెట్టు నుంచి 20 కిలోల గంధం వస్తుంది. రైతులు ఎవరైనా శ్రీగంధం సాగు చేసుకోవాలంటే సిద్దిపేట జిల్లా ములుగులో ప్రభుత్వ నర్సరీలో 30 రూపాయలకే మొక్క ఇస్తున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో నర్సరీ ఉంది. అక్కడైనా శ్రీగంధం మొక్కలు కొనుగోలు చేసుకోవచ్చు. ఎర్రచందనం సాగు చేయడం వల్ల రైతులు నష్టపోతారు. ఎందుకంటే సరైన చేవ(షాగ) రాకపోతే అమ్ముడు పోదు. ఎర్రచందనం శేషాచలం అడవుల్లోనే సరైన షాగ వస్తుంది. అందుకే అక్కడ పెరిగిన ఎర్రచందనం చెట్లకు డిమాండ్ ఉంటుంది.
– ఎస్ శంకర్, ఉద్యానవన అధికారి, హనుమకొండ