కరీమాబాద్, మే 13 : పదో తరగతి పరీక్షల్లో కరీమాబాద్కు చెందిన న్యూకౌటిల్యాస్ సెయింట్ ఆమన్ పాఠశాల విద్యార్థలు ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు కరస్పాండెంట్ కోడం శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో విద్యార్థులను శనివారం అభినందించారు.
ఈ సందర్భంగా కోడం శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు పవన్, లక్ష్మీప్రణతి 10/10 జీపీఏ సాధించగా, 12 మందికిపైగా 9.0 కన్నా ఎక్కువ జీపీఏ సాధించారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తాము నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోడం సబిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.