వరంగల్, అక్టోబర్ 6 : భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణం గురువారం సాయంత్రం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఉదయం అమ్మవారికి నిర్వహించిన అష్టోత్తర శత ఘటాభిషేకంలో నగర మేయర్ గుండు సుధారాణి- ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి పూజలు చేశారు. భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవంతో ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు అర్చకులు, సిబ్బంబది తెలిపారు.