ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా పట్టుదలతో స్వయంఉపాధిని ఎంచుకున్నాడు. నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తూ తనతోపాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు కమలాపూర్ మండలం ఉప్పరపల్లికి చెందిన బీటెక్ విద్యార్థి కంది మణిసాయి. మొదట్లోనే కోళ్లు మృతి చెంది ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలినా పోయినచోటనే దొరకబట్టుకోవాలని మరింత కష్టపడ్డాడు. రూ. 5లక్షల పెట్టుబడితో ప్రారంభించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రూ. 50 లక్షలకు విస్తరించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసి ఇబ్బంది పడేదానికంటే తన కాళ్లపై తనే నిలబడడంతోపాటు ఇతరులకు ఉపాధి కల్పించాలని బీటెక్ విద్యార్థి రూ. ఐదులక్షల పెట్టుబడి తో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. రెండేళ్లలోనే రూ. 50 లక్షలకు వ్యాపారాన్ని పెంపొం దించా డు. కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి గ్రామానికి చెందిన కంది పద్మ-రవి దంపతుల కుమా రుడు మణిసాయి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగపూర్ కిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మందులతో పెరిగిన బాయిలర్ కోళ్లు మాంసం తిని అనేక మంది షుగర్, గుండెపో టుతో చనిపోతున్నారని ఇంటర్ చదివే రోజుల్లోనే గుర్తించాడు. దీంతో ఎలాంటి రసాయనాలు వాడ కుండా ఆర్గానిక్ దాణాతో నాటుకోళ్లను పెంచాలనుకున్నాడు. యూట్యూబ్ చానల్, తెలిసిన వ్యక్తుల సల హాలు తీసుకుని మహారాష్ట్రలోని నాసిక్లో సొనాలి బ్రీడ్కు చెందిన నాటుకోడి పిల్లలు కొనుగోలు చేశాడు. డిసెంబర్ 2020లో రూ. ఐదు లక్షలతో నాటుకోళ్ల ఫామ్ ఏర్పాటు చేశాడు.
ఆరు బ్యాచ్లు తీస్తే రూ. 20 లక్షల ఆదాయం వచ్చింది. దాంతో ఒకేసారి 18 వేల కోడిపిల్లలను ఉత్ప త్తి చేసే కెపాసిటీ గల యంత్రాలను కొనుగోలు చేసి వాటిని ఇంట్లోని గదిలో ఏర్పాటు చేశాడు. దశల వారీగా ఆర్డర్లను బట్టి ఆరువేల చొప్పున మూడుసార్లు గుడ్లను యంత్రంలో పెట్టి కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు. కోడిపిల్లల ఉత్పత్తి పెంపకంపై యూట్యూబ్ చానల్ ద్వారా ప్రచారం చేయడంతో కోడిపిల్లల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని అన్ని జిల్లాల నుంచి ఆర్డర్లు ఇస్తున్నారు. ఒక్కో కోడిపిల్ల రూ. 35కు విక్రయిస్తున్నాడు. ఇప్పటికే వందమందికి పైగా రైతులకు నాటుకోళ్ల పెంపకానికి పిల్లలను అమ్మినట్లు చెప్పాడు.
సోనాలీ బ్రీడ్ నాటుకోళ్లు నాలుగు నెలలకోసారి ఒక బ్యాచ్ వస్తుంది. ఏడు వందల కెపాసిటీ ఉండే ఫామ్లో నాటుకోళ్లను పెంచుతున్నాడు. ప్రతి గంటకోసారి ఫామ్లో పెట్టే గుడ్లను తీసి ట్రేలలో పెడుతారు. కోడి పిల్లల ఆర్డర్ ఉంటే పిల్లల ఉత్పత్తి చేస్తారు. కోడిగుడ్లు ఆర్డర్ ఉంటే గుడ్లను హైదరాబాద్ వంటి పట్టణాలకు సరఫరా చేస్తాడు. కార్పొరేట్ దవాఖానలకు రూ. 20కు ఒక గుడ్డు అమ్ముతుండగా, నెలకు 1500 గుడ్లు అమ్ముడుపోతున్నాయి. అలాగే చికెన్ సెంటర్లకు కిలో రూ. 300 నుంచి 350కు నాటుకోళ్లు అమ్ముతున్నాడు. బ్యాచ్ వేసినప్పటి నుంచి రసాయనాలు లేని స్నేహ కంపెనీకి చెందిన ఆర్గానిక్ దాణాతో పెంచుతున్నాడు.
ఉద్యోగం చేస్తే ఒకరి కింద పనిచేయడమే కాకుండా జీవితంలో తృప్తి అంటూ ఉండదు. ఎప్పటికి ఉద్యోగ బాధ్యతలతో ఇబ్బంది పడేకన్నా వ్యాపారం చేసుకుని ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించడం బాగుంటుందని భావించి నాటుకోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నా. తొలుత నష్టం జరిగినా బాధపడకుండా ఎలాగైన రాణించాలనే ఉద్దేశంతో చందన ఫామ్స్ అండ్ హ్యాచరీస్ పేరుతో నాటుకోళ్ల పెంపకంలో అంచలంచెలుగా రాణిస్తూ వంద మంది రైతులకు సలహాలు ఇస్తూ పెంపకాలను ప్రోత్సహిస్తున్నా. ప్రభుత్వం కేవీకేల ద్వారా నాటుకోళ్ల పెంపకంపై అవగాహన కల్పిస్తుండడంతో కొనుగోలుకు ఆర్డర్లు వస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా కావాలనుకుంటే 7569662912 నంబర్లో సంప్రదించాలన్నారు.
2021లో కరోనా సమయంలో రెండు బ్యాచ్లు వేశాడు. బర్డ్ ప్లూ వ్యాధి సోకి రెండు వేల కోళ్లు మృతి చెందడంతో రూ. ఆరు లక్షల నష్టం వాటిల్లింది. మొదలు పెట్టిన తొలిసారే కోళ్లు మృతి చెందడం ఆర్థికంగా పెద్దదెబ్బ తగిలింది. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం కావడం ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు నాటుకోళ్ల పెంపకం వద్దన్నారు. పోయిన చోటనే దొరకబట్టుకోవాలని పట్టుదలతో నష్టం వచ్చిందని బాధపడకుండా పశువైద్యాధికారులు ఇచ్చిన సలహాలతో తిరిగి పెంపకం ప్రారంభించి ఇప్పటి వరకు ఆరు బ్యాచ్లు తీశాడు.