కాజీపేట, ఫిబ్రవరి 8 : కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ప్రస్తుతం ఈ షెడ్లో 113 డబ్ల్యూఏజీ-7 ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణ జరుగుతున్నది. కాగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కాజీపేట డీజిల్ లోకో షెడ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.