నెక్కొండ, సెప్టెంబర్ 10: నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపక్షాలకు జెండాలు తప్ప ఎజెండాలు లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఎజెండా లేని ప్రతిపక్ష నాయకులు పంట నష్టపరిహారం పంపిణీని రాద్ధాంతం చేస్తూ అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మండలంలోని అలంకానిపేట రైతు వేదికలో ఆదివారం రైతులకు పంట నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికారపక్ష పాత్ర, ప్రతిపక్ష పాత్ర తమదేనని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలకు సాయం అవసరమైనప్పుడు, కష్టమొచ్చినప్పుడు విపక్ష నాయకుల జాడ ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు.
కరోనా సమయంలోనూ తాను నిత్యం ప్రజల మధ్యే ఉండి సేవలందించానని గుర్తుచేసుకున్నారు. అందుకే నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు ఎజెండా లేదని స్పష్టమవుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.32 లక్షల మందికి పంట నష్టపరిహారం మంజూరు కాగా, ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోనే 39,500 మంది రైతులకు పరిహారం మంజూరైందని గుర్తుచేశారు. రాష్ట్ర ఖజానా నుంచి రూ. 151 కోట్లు మంజూరైతే.. రూ. 42 కోట్ల సాయం నియోజకవర్గ రైతులకు అందిందన్నారు. పంట నష్టపరిహారం పంపిణీలో 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, కేంద్రం నయా పైసా పంపిణీ చేయలేదన్నారు. దీంతో రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్ చలువతో అన్నదాతలకు పూర్తి సాయం దక్కిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పంటలు నిండా మునిగి రైతులు నష్టపోతే ఒక్క పైసా సాయం అందించలేదని విమర్శించారు. విపక్ష నేతలకు నేడు పంట నష్టపరిహారంపై మాట్లాడే అర్హత ఎంతమాత్రం లేదన్నారు.
వారు ధర్నాలు చేయడం దారుణం
పంట నష్టపరిహారం పొందిన ప్రతిపక్ష నాయకులే రోడ్డుపై చేరి ధర్నాలు చేయడానికి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఘర్షణలు చేయడానికి సిగ్గు లేదా అని ఎమ్మెల్యే పెద్ది ప్రశ్నించారు. విపక్ష నేతల వలే చిల్లర రాజకీయాలు చేయడం తనకు తెలియదన్నారు. తనకు కావాల్సింది నియోజకవర్గంలోని రైతులు అభివృద్ధి చెందడమేనని స్పష్టం చేశారు. పంట నష్టపరిహారం చెల్లింపుల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, సాయం అందని రైతులకు పరిహారం కంటే ఎక్కువ సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం రూ. 75 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. 50 శాతం సబ్సిడీపై వాటిని రైతులకు అందిచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఇందులో పరిహారం అందని రైతులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అలంకానిపేట పరిధిలోని అలంకానిపేట, బొల్లికొండలోని 967 మంది రైతులకు రూ. 80,20,000 ఇన్పుట్ సబ్సిడీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీ రవి, ఎంపీటీసీ శ్రీనివాస్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, పీపీ షేక్ అబ్దుల్నబీ, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏవో నాగరాజు, మండల నాయకులు గుంటుక సోమయ్య, యాసం బాలకృష్ణ, గాదె భద్రయ్య, దేవనబోయిన వీరభద్రయ్య, సర్పంచ్లు బదావత్ స్వరుపా రవి, ఫకీర్మియా, ఏఈవోలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై..
దుగ్గొండి: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మందపల్లి నుంచి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో సిరిపెల్లి అశోక్, మాతంగి శంకర్, పసునూటి యాకయ్య, రాంపాక ప్రబాకర్, జమ్ముల రాజేందర్, వేల్పుల లింగమూర్తి, మాచినపల్లి శ్రీకాంత్, వేల్పుల రాజేశ్, పసునూటి ప్రవీణ్, పసునూటి యాకయ్య ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా అర్హులందరికీ అందుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ గెలుపునకు సైనికుల్లా కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధి రాజ్కుమార్, క్లస్టర్ ఇన్చార్జి కంచరకుంట్ల శ్రీనివాస్రెడ్డి, మందపల్లి సర్పంచ్ మొగ్గం మహేందర్, బీఆర్ఎస్ గ్రామ నాయకులు నూతనకంటి శ్రీనివాస్, రంగు వెంకటేశ్వర్లు, మాతంగి రాజేందర్, మాతంగి రాజేందర్, మేదరి మొగిలి పాల్గొన్నారు. అలాగే, మండలంలోని మల్లంపల్లికి చెందిన వివిధ పార్టీల యువకులు 20 మంది బీఆర్ఎస్లో చేశారు. యువత చేతుల్లోనే రాష్ట్ర, దేశాభివృద్ధి ఆధారపడి ఉందని పెద్ది అన్నారు. బీఆర్ఎస్ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బూర హేమచంద్గౌడ్, శంకేసి కమలాకర్, తడుక కొంరెల్లి పాల్గొన్నారు.
నల్లబెల్లి: నారక్కపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 కుటుంబాలు మాజీ ఎంపీపీ బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఉనికి కోసం కాంగ్రెస్, బీజేపీ పాకులాడుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది విమర్శించారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్, వక్కల చంద్రమౌళి, తిరుపతి పాల్గొన్నారు.