నర్సంపేట, నవంబర్ 2: ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డికే ప్రజల మద్దతు ఉందని నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోసం నర్సంపేట పట్టణంలోని 22, 10, 2వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించారని తెలిపారు. సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు అందేలా చేశారని పేర్కొన్నారు. అందుకే ప్రజలందరూ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అండగా ఉన్నారని తెలిపారు. కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మా ప్రసాద్, జుర్రు రాజు యాదవ్, యువరాజు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోసం గురువారం మండలంలోని లక్నెపల్లి, రామవరం, చిన్న గురిజాల, ముగ్ధుంపురం, ద్వారకపేట గ్రామాల్లో ప్రచారం జోరుగా కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచార పోస్టర్లతో ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్యే పెద్దికి మద్దతుగా నిలువాలని కోరారు. ముగ్ధుంపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, నర్సంపేట 6వ వార్డు కౌన్సిలర్ రామసహాయం శ్రీదేవి మాట్లాడారు. పెద్ది గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్లస్టర్ ఇన్చార్జిలు మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె కోమాండ్ల గోపాల్రెడ్డి, కడారి కుమారస్వామి, తాళ్లపెల్లి రాంప్రసాద్, సర్పంచ్ పెండ్యాల జ్యోతి, చాపర్తి భిక్షపతి, పెండ్యాల ప్రభాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, ఉప సర్పంచ్ ఇస్లావత్ ఉన్నారు.
చెన్నారావుపేట: మండల కేంద్రం, ఉప్పరపల్లి, అమినాబాద్లలో గురువారం ఇంటింటా ప్రచారం, పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైస్ ఎంపీపీ, పార్టీ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. సీఎం కేసీఆర్ పక్షపాతి, రైతుబంధు, దివ్యాంగులు, వృద్ధులకు పెంచిన పింఛన్ వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రఫీ, ముఖ్య నాయకులు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, క్లస్టర్ బాధ్యులు వీరారెడ్డి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, యూత్ కన్వీనర్ కృష్ణచైతన్యరెడ్డి, రాంరెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, పెరుమాండ్ల శ్రీధర్రెడ్డి, సొసైటీ చైర్మన్ మురహరి రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసి కుమారస్వామి, పార్టీ గ్రామ అధ్యక్షులు సాంబయ్య, కడారి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ: నెక్కొండలో సొసైటీ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, బీఆర్ఎస్కు ఓటేసి మళ్లీ ఎమ్మెల్యే పెద్దిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండల అధికార ప్రతినిధి కొమ్ము రమేశ్యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, ఉపసర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, ఈదునూరి వెంకన్న, రావుల భాస్కర్రెడ్డి, కారింగుల సురేశ్, బొడ్డుపెల్లి రాజు పాల్గొన్నారు.
దళితుల అభ్యున్నతికి బీఆర్ఎస్ పెద్దపీట వేసి దళితబంధు పథకాన్ని తీసుకువచ్చిందని పార్టీ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కళ్లెపెల్లి సురేశ్ అన్నారు. మండలంలోని తోపనపల్లిలో దళిత కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి, దళిత కాలనీల్లో దళిత సంఘాల నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈదునూరి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది నియోజకవర్గంలోని దళిత కాలనీల అభివృద్ధికి కృషిచేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 1200 చొప్పున దళితబంధు యూనిట్లు మంజూరు కాగా, ఎమ్మెల్యే పెద్ది మరో 350 యూనిట్లను అదనంగా తెచ్చారని తెలిపారు. దళితుల కోసం పాడిగేదెల పథకాన్ని తీసుకువచ్చి ఎంతో మంది దళిత కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. బీఆర్ఎస్కే ఓటేసి పట్టం కట్టాలని కోరారు. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఈదునూరి వెంకన్న, ఎస్సీ సెల్ సమన్వయ కమిటీ సభ్యులు నేలమారి రాజు, సర్పంచ్ ఫకీర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు కన్నెబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు బండారు మురళి, నాయకులు మునిగె అశోక్, మట్టె వెంకన్న, గడ్డం రమేశ్, తోళ్ల యాకయ్య పాల్గొన్నారు.
నర్సంపేట(దుగ్గొండి): దుగ్గొండి మండలం బంధంపల్లి దళితకాలనీ వాసులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి మద్దతు తెలిపారు. ఇక్కడ గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ మైసి శోభన్ మాట్లాడారు. కారుగుర్తుకు ఓటు వేసి నర్సంపేట ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్రెడ్డిని గెలిపించాలని కోరారు. మంద అనిల్, సర్పంచ్ అంకిల్ల సునీతా రవి, ఎంపీటీసీ సభ్యుడు మామునూరి సుమన్, మాజీ సర్పంచ్ వడ్డెపెల్లి కృష్ణ, పార్టీ గ్రామ అధ్యక్షుడు పల్లం శ్రవణ్కుమార్, వార్డు సభ్యులు జన్ను రంజిత్, హేమలత, కొత్తూరి లక్ష్మీ, కులసంఘం పెద్దలు రాంచంద్రయ్య, గొర్రె శ్రీను పాల్గొన్నారు.
నియోజకవర్గంలో రిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేదని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి అన్నారు. గురువారం దుగ్గొండి మండలం జీడికల్లో 56 ముదిరాజ్ కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గెలుపు కోసం మద్దతు తెలిపాయి. ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు పూర్తి చేశారని, ఎమ్మెల్యే సహకారంతో గ్రామ చెరువును మత్స్య సహకార సంఘానికి కేటాయించారని పేర్కొన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా పెద్దిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈమేరకు తాము ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు చెప్పారు. మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పల్లె రమేశ్, గ్రామ అధ్యక్షుడు గొర్రె రామకృష్ణ, దండు లక్ష్మయ్య, గొర్రె కొమ్మాలు, గొర్రె యుగందర్, దండు సంపత్, సొసైటీ డైరెక్టర్ యుగంధర్, వీరమల్ల రమేశ్, గొర్రె రాజు, దండు రవి, సూరిపల్లి రాజు, సార ప్రశాంత్, గొర్రె కృష్ణంరాజు, చిన్నాల సమ్మయ్య, గణేశ్, మల్లయ్య పాల్గొన్నారు.