హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : అధికార పార్టీలోని తుం గతుర్తి పంచాయితీ గాంధీభవన్కు చే రింది. ఎమ్మెల్యే సామేల్.. తన నియోజకవర్గంలో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, భువనగిరి ఎంపీ చా మల కిరణ్కుమార్రెడ్డిపై విమర్శలు చే శారు. దీనిపై ప్రత్యర్థి వర్గం కూడా ప్రతిస్పందించింది. వారం రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు క్షేత్రస్థాయిలో జరుగుతుండగా, తాజాగా సో మవారం ఈ వివాదం గాంధీభవన్కు చేరింది. సామేల్కు వ్యతిరేకంగా తిరుమలగిరి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్లో ఆందోళన చేశారు. రాజగోపాల్రెడ్డికి మద్దతుగా స్థానికంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసినందుకు తిరుమలగిరి మండల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ సామేల్కు వ్యతిరేకంగా ఎంపీ చామల మద్దతుదారులు నినాదాలు చే శారు. సామేల్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సొంతపార్టీ నేతలను కులం పేరుతో విమర్శి స్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్న సామేల్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మీనాక్షీనటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ను డిమాండ్ చేశారు.