పక్కా ఇల్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు 5,456 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. 3,787 ఇండ్ల కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. వీటిలో 47 ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్ దశలో ఉండగా 493 ఇండ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2,302 ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. 880 ఇండ్లు పూర్తికాగా 393 ఇండ్లను అధికారులు లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన ఇండ్ల పనులను త్వరగా పూర్తిచేసి జనవరి 15న అర్హులకు అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.114.33 కోట్లు వెచ్చించింది.
వరంగల్, నవంబర్ 29: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లలో చేపట్టిన నగర బాట అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో నగరబాట అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరబాట కార్యక్రమంలో భాగంగా గ్రేటర్లోని 49 డివిజన్ల పరిధిలో రూ. 27.57 కోట్లతో 90 అభివృద్ధి పనులు మంజూరు చేశామని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి డివిజన్లలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు.
వాటిని సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటివరకు రూ. 3.43 కోట్ల వ్యయంతో చేపట్టిన 17 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, రూ.2.62 కోట్లతో చేపట్టిన 11 పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 10 పనులు అగ్రిమెంట్ దశలో ఉన్నాయని, మిగిలిన పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని అధికారులు వివరించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ నగరబాటలో గుర్తించిన పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించా రు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జి ఎస్ఈ రా జయ్య, ఈఈలు బీఎల్ శ్రీనివాసరావు, సంజయ్కుమార్, శ్రీనివాసరావు, డీఈలు రవికుమార్, రవికిరణ్, నరేందర్, సారంగం పాల్గొన్నారు.