నమస్తే తెలంగాణ నెట్వర్క్: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఈద్గా ఘనీ అబ్దుల్ అజీజ్ కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా అన్నారు. వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్ ఈద్గాలో వేలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. నల్లబెల్లి మండలంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో మత గురువు ఇమామ్ హబీబుల్ రహమన్ రంజాన్ ప్రత్యేకతను తెలిపారు. ఖానాపురం మండలం బుధరావుపేటలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గా, తురుకల సోమారం, చింతనెక్కొండ, వడ్లకొండ, పర్వతగిరి, కల్లెడ, కొంకపాకలో ప్రార్థనలు చేశారు. వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు వర్ధన్నపేట పట్టణంలోని ముస్లింల ఇండ్లకు వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఐనవోలు, రాయపర్తి మండలంలో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను నిర్వహించుకున్నారు. మండల కేంద్రం శివారు కొండూ రు రోడ్డులోని మసీద్-ఏ-విద్యానగర్, మసీదు గడ్డలో మహ్మద్ హుస్సేన్ నేతృత్వంలో ప్రార్థనలు చేశారు.
కాజీపేట, బోడగుట్ట, దర్గా, ప్రశాంత్నగర్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా కాజీపేటలో దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా సయ్యద్ షా అఫ్జల్ బియాబాని ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేశారు. దామెర మండలంలోని ఊరుగొండ ఈద్గా లో వైస్ ఎంపీపీ జాకీర్అలీ, కోగిల్వాయి ఈద్గాలో మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అక్తర్, ఓగులాపురం సైలనాబీ బాబా దర్గాలో సైలానీబాబా, నడికూడ మండలంలోని ముస్త్యాలపల్లి, గీసుగొండ మండలంతో పాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో, సంగెం మండలంలోని స్టేషన్ చింతలపల్లి, గవిచర్ల గ్రామాల్లోని ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, హనుమకొండ జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ సంపత్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. వేలేరులోని షేక్ ఫరీద్ షక్కర్ గంజ్ బాబా దర్గా, ధర్మసాగర్లో ముస్లింలు ఈద్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
హనుమకొండ చౌరస్తా : మత సామరస్యానికి పుట్టినిల్లు ఓరుగల్లు అని బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ నయీముద్దీన్ అన్నారు. పెద్దమ్మగడ్డ ఈద్గా హుస్సేనీ ఆలంలో ఈద్-ఉల్-ఫితర్ మౌలానా మోహినుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈద్గా కమిటీ సభ్యులు సలీం, ఖలీల్, మొయిన్, తౌసిఫ్ పాల్గొన్నారు.