గోవిందరావుపేట : దేవ దర్శనానికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన ఉమ్మరాజు రాజమౌళి(55) అనే టీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. సోమవారం ఉదయం దర్శనానికి వెళ్లేందుకు సిద్దమవుతున్న క్రమంలోనే ఒక్క సారిగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజమౌళి చల్వాయిలో గత 20 ఏండ్లుగా బ్యాండ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. మృతినికి భార్యతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు.
కార్యకర్త మృతి సమాచారం తెలుసుకున్న ములుగు జడ్పీ చైర్మన్ కుసమ జగదీశ్వర్ రాజమౌళి కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతిని కుటుంబాన్ని సోమవారం సాయంత్రం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూరపనేని సాయికుమార్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహనాయక్, కోఆప్షన్ సభ్యుడు బాబర్, నాయకులు రంజిత్, శ్రీనివాస్ రావు, ప్రసాద్, వెంకట్రెడ్డి, భాస్కర్, నాగాచారి, సంతోష్, సంజీవ, మధుతో పాటు పలువురు ఉన్నారు.