ములుగు : జిల్లాలోని రామప్పలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవ వేడుకల సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించే వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సమైక్యత దినోత్సవ వేడుకలు 16వ తేదీన ములుగు జిల్లా కేంద్రం ప్రేమ్ నగర్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు 15 వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ, 17వ తేదీన కలెక్టరేట్లో నిర్వహించే సమైక్యతా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు
పాల్గొంటారు. 18న వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సమైక్యత దినోత్సవ ముగింపు వేడుకలకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రముఖ సంగీత వాయిద్య కారుడు శివమణి హాజరవుతారని ఆయన తెలిపారు.