ములుగు : అనారోగ్యంతో బాధపడుతున్న ములుగు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడికి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి అండగా నిలిచారు. గోవిందరావు పేట మండలం, చల్వాయి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాం పూర్ణ చందర్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
కిడ్నీ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయల ఎల్వోసీని సతీశ్ రెడ్డి మంజూరు చేయించారు. ఎల్వోసీ చెక్కును పూర్ణచందర్ సోదరుడు రవికి హైదరాబాద్లోని తన కార్యాలయంలో అందించారు. వైద్యానికి మరింత ఖర్చు అయినా తాను అండగా ఉంటానని, పార్టీ, ప్రభుత్వం తరపున సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సతీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. పూర్ణచందర్ కు సర్జరీ విజయవంతంగా పూర్తై, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.