ములుగు : అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ములుగు పాల్ సాబ్ పల్లె గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు పాల్ సాబ్ పల్లె మధ్యలో ఉన్న పంట పొలాల్లో తిరుగుతున్న అడవి పంది అటుగా వెళ్తున్న సాంబయ్య అనే వ్యక్తిని గాయపరిచింది. గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అడవి పందిని బంధించారు.