ఆత్మకూరు, జనవరి 29 : కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని, అధైర్యపడవద్దని అండగా ఉంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో ఇటీవల కక్కెర్ల నర్సమ్మ, నలుపు రత్నమ్మ, గంప కమల మృతిచెందగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. మృతుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, సర్పంచ్ సావురే కమలా రాజేశ్వర్రావు, మాజీ సర్పంచ్ లకిడే శివాజీ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు (డీఆర్) రాయరాకుల రవీందర్, ప్రధాన కార్యదర్శి రమేశ్, కోశాధికారి కమలహాసన్, మండల యూత్ అధ్యక్షుడు వంశీగౌడ్, ఉపసర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
దామెర : మండలంలోని ముస్త్యాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద జయశంకర్ విగ్రహ ఏర్పాట్లతోపాటు జంక్షన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇక్కడ మోడల్ జంక్షన్గా తీర్చిదిద్ది జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ రాధికారాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, సర్పంచ్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిలివేరు రాజు, జాతర చైర్మన్ గుండెబోయిన రాజన్నగౌడ్ ఉన్నారు.