వాజేడు, జూన్ 22:రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ నయాగరా బొగత జలపాతానికి జలకళ వచ్చింది. గలగల పారుతూ 50 అడుగులపై నుంచి కిందకు జాలువారుతున్న జల సవ్వడులతో పర్యాటకులను ఆకట్టుకుం టోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతంలోకి మండలంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ర్టం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం వరద నీరు మరింత రావడంతో జలపాతానికి కొత్తందం వచ్చింది. –