అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి
పోలీసుల పర్యవేక్షణ
కొనసాగిన ధాన్యం కొనుగోళ్లు
నర్సంపేట, మే 12: నర్సంపేట నియోజకవర్గంలో లాక్డౌన్ మొదటి రోజు విజయవంతంగా కొనసాగింది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పోలీసులు పట్టణంలో 9.30 నుంచే ప్రతి షాపు తిరిగి 10 గంటలకు మూసి వేయాలని సూచించారు. అత్యవసర సేవలైన వైద్యశాలలు, మెడికల్ షాపులను మాత్రమే తెరిచారు. నర్సంపేట ఏసీపీ ఫణీందర్, డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్, పోలీసులు లాక్డౌన్ను పర్యవేక్షించారు. నర్సంపేటలో ఉదయం ఆరు గంటలకు జనంతో రోడ్లనీ బిజీగా మారాయి. పది గంటలు కాగానే జనమంతా ఒకేసారి గప్చుప్ అయ్యారు. రోడ్లన్నీ జనం లేక వెలవెలబోయి కనిపించాయి.
విధిగా నిబంధనలు పాటించాలి
గీసుగొండ: లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి హెచ్చరించారు. మండలంలోని జాన్పాకలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనదారులకు సూచనలు చేశారు. 10 గంటల్లోపే పనులు ముగించుకొని ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సైలు అబ్దుల్హ్రీం, బండారి రాజు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
పరకాల/వర్ధన్నపేట, మే 12: ప్రజలు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలోని బస్టాండ్ సర్కిల్ వద్ద లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ మహేందర్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల్లోపే షాపులు తెరిచి ఉంటాయన్నారు. వర్ధన్నపేటలో ఏసీపీ గొల్ల రమేశ్ లాక్డౌన్ను పర్యవేక్షించారు. వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్లో జాతీయ రహదారిపై పోలీసు అధికారులతో కలిసి వాహనాలను ఆపి వివరాలు తెలుసుకున్నారు. సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/ఖానాపురం: మండలంలో లాక్డౌన్ మొదటి రోజు సక్సెస్ అయింది. వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థలు నిబంధనలు పాటించాయి. ఎస్సై యుగేంధర్ ఆధ్వర్యంలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రజారవాణాను కట్టడి చేశారు. చెన్నారావుపేటలో ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామానికి సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో శిక్షణ ఎస్సై మహేందర్, కానిస్టేబుళ్లు ఉపేందర్, తిరుపతి, రామకృష్ణ పాల్గొన్నారు. ఖానాపురం మండలంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే వ్యాపార సముదాయాలు నిర్వహించారు. ఎస్సై సాయిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు.
అనవసరంగా బయటకొస్తే చర్యలు
శాయంపేట/పర్వతగిరి/నడికూడ/దామెర: లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని సీఐ తోగిటి రమేశ్కుమార్ హెచ్చరించారు. శాయంపేటలోని ప్రధాన చౌరస్తా, మాందారిపేట స్టేజీ వద్ద జాతీయ రహదారిపై, గ్రామాల్లో లాక్డౌన్ను ఆయన ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్తో కలిసి పర్యవేక్షించారు. 10 గంటల తర్వాత రోడ్డెక్కితే చర్యలు తప్పవని సూచించారు. పర్వతగిరి మండలంలో లాక్డౌన్ను పీఎస్సై ముత్యం రాజేందర్ పర్యవేక్షించారు. మండలకేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహించారు. నిబంధనలకు సడలింపు ఇచ్చిన వారు తమ ఐడీ కార్డులతో రావాలని కోరారు. నడికూడ మండలంలో ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. నిబంధనలు పాటించాలని తహసీల్దార్ వీ మహేందర్ కోరారు. దామెర మండలంలోని అన్ని గ్రామాల్లో మొదటి రోజు లాక్డౌన్ సంపూర్ణమైంది. దామెర, ఊరుగొండ, ఓగ్లాపూర్ తదితర గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు పలుచోట్ల మోహరించారు. వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను ఆపి వివరాలు తెలుసుకున్నారు. శాయంపేట సీఐ రమేశ్కుమార్, ఎస్సై భాస్కర్రెడ్డి పర్యవేక్షించారు.
మూడు చెక్పోస్టుల ఏర్పాటు
సంగెం/గీసుగొండ/సంగెం/నెక్కొండ: లాక్డౌన్ వల్ల పోలీసులు సంగెం, తీగరాజుపల్లి, కాపులకనపర్తిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే పంపించారు. మాస్కు లేకుండా ప్రయాణించిన 18 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గీసుగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేసి ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. సంగెంలో తహసీల్దార్ బీ విశ్వనారాయణ కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కరోనా బారిన పడి ఐసొలేషన్లో ఉన్న వారు ఎట్టిపరిస్థితిలోనూ బయటకు రావొద్దని కోరారు. ఉపాధి పనుల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 41 లేదా 42 కిలోల చొప్పున ఆమోదించాలన్నారు. హమాలీలు, రైస్ మిల్లర్లకు ఐడీ కార్డులు అవసరముంటే తహసీల్లో సంప్రదించాలని సూచించారు. నెక్కొండలో మొదటి రోజు పకడ్బందీగా లాక్డౌన్ అమలైంది. ట్రైనీ ఎస్సై మాచర్ల శ్వేత పర్యవేక్షించి ప్రజలకు సూచనలు చేశారు.