హనుమకొండ చౌరస్తా, జూలై 28: ఆగస్టు 10న దళితుల మత స్వేచ్ఛ హక్కులు కాలరాసిన బ్లాక్ డేకు నిరసనగా సందర్భంగా హన్మకొండ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ వరకు దళిత క్రైస్తవ శాంతి యుత నిరసన ర్యాలీనీ విజయవంతం చేయాలని దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాను సాధించడం కోసం ఆగస్టు 3 నుండి 7వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత క్రైస్తవ శాంతి యుత మహాదిక్షలను అందరు భాగస్వాములై విజయం వంతంచేయాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ సమావేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ఎంపీలు మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక రాష్ట్ర నేతలు మాదాసి బిక్షపతి మాదిగ, సందేలా లాజర్, ఎర్రోళ్ల బాబు, నాగారపు స్వామి, మేకల బాబు,సిలువేరు నగేష్, జన్ను శ్యామ్ పాస్టర్లు దైవసేవకులు బరిగల జనార్దన్, నలగంటి విల్సన్, పాస్టర్ చిదిరల ముకేశ్, డాక్టర్ గణిపాక క్రాంతి,ఆరిశం శంకర్, ఈర్ల హరినాథ్, వెండి రాజు పాల్గొన్నారు