ములుగు : జిల్లాలోని వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో విద్యార్థుల బట్టలు, పెట్టెలు, బ్యాగులు, పుస్తకాలకు మంటలు అంటుకున్నాయి. గమనించిన విద్యార్థులు హాస్టల్ వార్డెన్కు తెలియజేయడంతో సిబ్బందితో కలిసి వార్డెన్ మంటలను ఆర్పి వేశారు.
షార్ట్ సర్క్యూట్ వలన ఏర్పడిన అగ్ని ప్రమాదంలో స్వల్ప నష్టం జరిగిందని, విద్యార్థుల ఎవరికి కూడా ప్రమాదం జరగలేదని ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిర పీల్చుకున్నారు.