ములుగు : ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతిపక్షాల ముఖ్య అనుచరులు వారి పార్టీలకు గుడ్బై చెబుతున్నారు. తాజాగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన ముఖ్యనేతలు, సీతక్క( Seetakka) అనుచరులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ (BRS) లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్ర మొగిలితో పాటు మరికొందరు ఆదివారం బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల సమస్యలు తెలిసిన మనిషిగా, అధికార వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కన్నాయిగూడెం మండలాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్న కన్నాయిగుడం మండలం నుంచి 50 మంది,అబ్బా పూర్ ములుగు నుంచి కాంగ్రెస్ నాయకులు, యువకులు చేరారని బడే నాగజ్యోతి అన్నారు.
తనను గెలిపిస్తే ములుగు (Mulugu) నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, ఎంపీటీసీలు రాజ్యలక్ష్మి-రమేష్ రెడ్డి, గొర్రె స్మమ్మయ్య సీనియర్ నాయకులు వేములపల్లి బిక్షపతి, మాజీ ఎంపీపీ వినయ్ కుమార్, పిఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో
ములుగు మండలం అబ్బపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉయ్యాలా రాజయ్య గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ గండి కల్పన కుమార్,మాజీ ఎంపీటీసీ ఆకుతోట చంద్రమౌళి, ఉపసర్పంచ్ నల్లెల్ల ప్రభాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కంచెం కొమరయ్య, జిల్లెల్ల చిన్నమల్లు, కంచెం కొమరయ్య, బాణాల తిరుపతి, జంగిలి రాజు, చెమ్మల విజేందర్, చెమ్మల సంతు, మోలుగురి మహేష్ చిక్కుల రాజు, కంచెం గట్టయ్య, వంగపల్లి మహేష్, బుస పర్వతాలు బీఆర్ఎస్లో చేరారు.
ఉయ్యాలా వెంకటేష్, సాయబోయిన మల్లయ్య, గువ్వ రాజు, కంచెం రాజేందర్, సూర లింగ మూర్తి, బొల్ల శంకర్, చొప్పరి నాగరాజు సాయబోయిన మల్లయ్య, జక్కుల తిరుపతి, కంచెం రవి, బుట్టి స్వామి, వంగపల్లి రవి, మామిడిశెట్టి రమేష్, చొప్పరి విజేందర్, యార సురేందర్, బుస చిన్నపర్తి, రాస కుమార్, బస రవి రుద్రబోయిన రాజయ్య తదితరులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ పార్టీలో చేరారు.