ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని జంపన్నవాగు దగ్గర బుధవారం ఉదయం ఇసుకలో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం కనిపించింది. సదరు వ్యక్తికి దాదాపుగా 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మృతుడు చామన ఛాయ రంగు, తెల్ల గడ్డం కలిగి ఉన్నాడు.
మృతుడు తెలుపు రంగు చొక్కా, ఒక పార్టీ ప్రచారానికి సంబంధించిన తెలుపు రంగు టీ షర్ట్, నీలం రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. సదరు వ్యక్తి మృతికి సంబంధించిన వివరాలేమీ తెలియ రాలేదు. సంఘటనా స్థలంలో అతనికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. ఊరట్టం వీఆర్వో బొప్ప సమ్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని ఏటూరునాగారం మార్చురీకి తరలించారు.
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించిన వారెవరైనా ఉంటే తాడ్వాయి పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్రింది ఫోన్ నెంబర్లను 9440700575, 9440795249 సంప్రదించాలని పోలీసులు తెలిపారు.