పర్వతగిరి, నవంబర్ 23: మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం మండలంలోని ముంజాలకుంట తండా, పెద్ద తండా, బూరుగుమళ్ల, మోత్యా తండా, మంగ్త్యాతండా, రావూర్, అన్నారం, కల్లెడ, దూపతండా, పర్వతగిరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి తనను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. 24గంటల కరెంట్, రైతుబంధుతో రైతులను, కల్యాణ లక్ష్మీతో ఆడబిడ్డల తల్లిదండ్రులను, పెన్షన్లతో వృద్ధలు, దివ్యాంగులను ఆదుకుంటున్నారని వివరించారు. ఇంకా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. 50ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోక, కమీషన్లకే పరిమితమయ్యారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. కొత్త బిచ్చగాడిలా ప్రతిపక్ష నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారని చెప్పారు. తరిమికొట్టి, నిత్యం అందుబాటులో ఉంటున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఎంపీపీ కమల పంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు పట్టాపురం ఏకాంతంగౌడ్, ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, బోయినపెల్లి యుగేందర్రావు, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, మాజీ ఎంపీపీ రంగు రజిత, చిన్నపాక శ్రీనివాస్, చీమల భిక్షపతి, ఏర్పుల శ్రీనివాస్, సర్పంచులు ఇందిరా జితేందర్రెడ్డి, శోభా పరమేశ్వర్రావు, మాలతీ సోమేశ్వర్రావు, యశోద బాబు, లునావత్ గణేశ్, ఈర్యానాయక్, బండి సంతోష్గౌడ్, జ్యోతి రవి, పంజా మహేశ్, పర్వతగిరి ఎంపీటీసీ మాడుగుల రాజు పాల్గొన్నారు.