సంగెం, మార్చి 14 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న విశ్వాసంతోనే విపక్ష నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని పల్లార్గూడ, పోచమ్మతండా గ్రామాలకు చెందిన 100 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ కక్కెర్ల సదానందం ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్తో ఒరిగేదేమీ లేదని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కీలక మార్పును సీఎం కేసీఆర్ తీసుకురానున్నారని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలని కోరారు. దేశం నుంచి బీజేపీని తరిమేసేదాకా పోరాటం ఆగదన్నారు.
చేరిన వారు వీరే..
మాజీ ఎంపీపీ కక్కెర్ల సదానందం, ఉప సర్పంచ్ కోడూరి రఘు, జిల్లా ఉపాధ్యక్షురాలు, వార్డు సభ్యురాలు గుర్రం గీత-రాజిరెడ్డి, వార్డు సభ్యులు బొమ్మాల నర్సయ్య, ఇప్ప స్రవంతి-రాజు, మాజీ సర్పంచ్ మోహన్, మాజీ ఎంపీటీసీ గుర్రం ధర్మారెడ్డి, బానోతు వీరన్న, బొమ్మ వీరన్న ఉన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, నరహరి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, మాజీ ఎంపీపీ దొనికెల మల్లయ్య, ఎంపీటీసీ గుగులోత్ వీరమ్మ, సర్పంచ్లు కక్కెర్ల కుమారస్వామి, బుచ్చానాయక్ పాల్గొన్నారు.