నర్సంపేట, అక్టోబర్ 27: పెద్ది సుదర్శన్రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని నర్సంపేట రెండో వార్డు కౌన్సిలర్ జర్రు రాజు, ఒకటో వార్డు కౌన్సిలర్ దేవోజు తిరుమల పిలుపునిచ్చారు. కారుగుర్తుకు ఓటు వేయాలని కోరుతూ శుక్రవారం వారు ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల హయాంలో కనీస సౌకర్యాలకు నోచుకోని నర్సంపేట డివిజన్.. పెద్ది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయినట్లు తెలిపారు. పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నర్సంపేటలో జిల్లాస్థాయి దవాఖాన, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటుతో వైద్య సౌకర్యాలు మెరుగుపడినట్లు వెల్లడించారు. వైద్య కళాశాల మంజూరుతో పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడిందన్నారు. నర్సంపేటలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, సీసీరోడ్లు, తారురోడ్లు, ఫుట్పాత్లు, ఆడిటోరియం, కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించినట్లు వివరించారు. హాస్టళ్లు, గురుకులాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత పెద్దికే దక్కిందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి గోనె యువరాజు, సతీశ్, మధు, నగేశ్, వినయ్, కుమార్, విజయ్, హేమంత్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: పెద్ది గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోతె జైపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు. ఇటుకాలపల్లి, నర్సింగాపురంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ గ్రామ కమిటీల సమావేశాల్లో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, క్లస్టర్ ఇన్చార్జిలు మోతె పద్మనాభరెడ్డి, కట్ల సుదర్శన్రెడ్డి, కడారి కుమారస్వామి, మచ్చిక నర్సయ్యగౌడ్, మాజీ సర్పంచ్ సున్నం కొమ్మాలు, నాయకులు నరేందర్, రమేశ్, రాజు పాల్గొన్నారు. అదేవిధంగా పర్శనాయక్తండాలో జరిగిన సమావేశంలో క్లస్టర్ ఇన్చార్జి అజ్మీరా మేగ్యానాయక్, సర్పంచ్ బానోత్ గాంధీ, కొర్ర రాంలాల్ మాట్లాడారు. నాయకులు ఈర్య, దేవ్లా, రమేశ్, రవి, తిరుపతి, సురేశ్ పాల్గొన్నారు.
ఖానాపురం/చెన్నారావుపేట: నర్సంపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డిని మరోసారి గెలిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్ అన్నారు. పెద్ది గెలుపు కోరుతూ అశోక్నగర్లోని కోదండరామాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కారుగుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ గొర్రె కవితా రవి, పార్టీ గ్రామ అధ్యక్షుడు యాదగిరిరావు, రామసహాయం ఉపేందర్రెడ్డి, బండి వెంకన్న, బాబురావు, రవి, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, రాంబాబు, రాజు పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో యువకులతో బీఆర్ఎస్ యూత్ మండల కన్వీనర్ కంది కృష్ణచైతన్యరెడ్డి సమావేశమయ్యారు. పెద్దిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు యువకులు కృషి చేయాలని కోరారు. అలాగే, లింగగిరిలో ఎస్సీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పార్టీ ఎస్సీసెల్ నియోజకవర్గ కన్వీనర్ కళ్లెపెల్లి సురేశ్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ దళితుల పక్షపాతి అని, ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి పెద్దిని గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు బోడ బద్దూనాయక్, ఎంపీటీసీ ధరావత్ శ్రీను, గ్రామ అధ్యక్షుడు దంజ్యా, పార్టీ లింగగిరి గ్రామ అధ్యక్షుడు మాదారపు శ్రీనివాస్, ఎస్సీసెల్ డివిజన్ నాయకులు కోట డేవిడ్, టేకుల స్వామి, సురేశ్, సర్పంచ్ భాస్కర్, యాకయ్య, ప్రవీణ్ తదిత రులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్రెడ్డికి ఊహించని మెజార్టీ అందించడమే యూత్ కమిటీల లక్ష్యమని యూత్ కమిటీ నియోజకవర్గ కన్వీనర్ శానబోయిన రాజ్కుమార్ అన్నారు. రుద్రగూడెంలో యూత్ కమిటీ మండల అధ్యక్షుడు డ్యాగల రాజేశ్ అధ్యక్షతన జరిగిన యువజన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచార అస్ర్తాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంతేకాకుండా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో రంగాపురం, ధర్మారావుపల్లెలో బీఆర్ఎస్ క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు. పెద్ది గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు రాజేశ్వర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, క్లస్టర్ ఇన్చార్జీలు గందె శ్రీనివాస్గుప్తా, ప్రతాప్సింగ్, ప్రభాకర్రావు, ఇంగ్లి శివాజీ, యూత్ మండల కార్యదర్శి అఖిల్, నాయకులు యుగేంధర్, వినోద్, వక్కల అయ్యప్ప, శ్రీకాంత్, కుమార్, రాకేశ్, మనోజ్స్వామి పాల్గొన్నారు.