దేవరుప్పుల, ఫిబ్రవరి 1 : పల్లెప్రగతి కార్యక్రమంలో ఇప్పటికే గ్రామాల సుందరీకరణ జరిగిందని, సాగు, తాగునీరు, రహదారుల పనులు పూర్తికాగా నేడు ‘మన ఊరు-మన బడి’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కార్పొరేట్కు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా బుధవారం మండలంలోని మొండిచింత తండాలో ఆధునీకరించిన ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు. అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తాను మొదటిసారి పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గ్రామాలకు సరైన రహదారులు లేవు, సాగు, తాగునీటి సమస్య ఉండేదన్నారు.
తాను గ్రామాల్లో పర్యటిస్తే బోరు వేయాలని, మరికొన్ని చోట్ల మరమ్మతులు చేయాలని ప్రజలు అడిగేవారని గుర్తు చేశారు. గత 70ఏళ్లుగా ఏనాడూ కనిపించని అభివృద్ధి సంక్షేమ పథకాలు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఎర్రబెల్లి అన్నారు. ఇక విద్యావ్యవస్థపై దృష్టి సారించగా ‘మన ఊరు-మన బడి’ పేర అన్ని పాఠశాలలు ఆధునీకరించేందుకు రూ.7,289 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. దీంతో అన్ని పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు సం తరించుకోనున్నాయని మంత్రి అన్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై మోజు వీడాలని, అనవసరంగా ప్రైవేట్ స్కూళ్లలో చదివించి ఆర్థికంగా కుంగిపోవద్దని కోరారు. అర్హులైన ఉపాధ్యాయులు, ఉచిత విద్య, భోజనం ఉన్న సర్కారు స్కూళ్లకే పిల్లలను పం పాలని సూచించారు. అనంతరం మొండి చింతతండాలో ప్రభుత్వం గ్రామపంచామయతీనిర్మాణానికి రూ. 12 లక్షలు నిధులు మంజూరు చేయగా మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. దేవరుప్పుల మండలంలోని అన్ని నూతన గ్రామపంచాయతీలకు నూతన భవనాలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు.
26 మహిళా గ్రూపులకు రూ. రూ.3,26 కోట్ల రుణాలు అందజేత..
దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాల్లోని 26 మహిళా పొదుపు సంఘాలకు రూ.3.26 కోట్ల రుణాల చెక్కులను మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదు గా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తేనే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయన్నారు. అందుకోసమే అనేక స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రయోగాత్మకంగా పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో కు ట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అనంతరం లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, డీఈవో రాము, జడ్పీటీసీ పల్లా భార్గవీరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, మండల నాయకులు సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్కుమార్, మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్య, సర్పంచ్ భూక్యా వీరేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, విద్యాకమిటీ చైర్మన్ లక్ష్మణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, రమేశ్, మంగ్త్యా, జైహింద్, వెంకన్న పాల్గొన్నారు.