ములుగురూరల్, అక్టోబర్ 20 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మాధవరావుపల్లెకు చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ శశిరేఖ శుక్రవారం బీఆర్ఎస్లో చేరగా పోచంపల్లి ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లోకి స్వచ్ఛందంగా వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె, గూడెం, తండా, నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు.
రాష్ట్రంలో క్రీడలను గుర్తించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటేనని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడి మైదానంలో క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయి క్రీడాకారులను గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దకుతుందన్నారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ప్రభుత్వం క్రీడామైదానాలను నిర్మించినట్లు తెలిపారు. అంతేకాకుండా క్రీడాకారుల కోసం కేసీఆర్ క్రీడా కిట్లు సైతం ఇచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు క్రీడాకారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణలో గొప్ప గొప్ప క్రీడాకారులున్నారని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థానంలో నిలుపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని వివరించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, సీనియర్ నాయకుడు గండ్రకోట సుధీర్ యాదవ్, నాయకులు గడ్డమీద భాసర్, మాదం సాగర్, పైడిమల్ల గోపి, వీర్ల వెంకన్న, అజయ్, నాయకులు పాల్గొన్నారు.