ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తోడేళ్లగుంపులా కాలనీలకు వచ్చే ప్రతిక్షపక్ష పార్టీల నాయకులను తరిమికొట్టాలని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్ నాలుగో డివిజన్ పెద్దమ్మగడ్డలోని ఆర్ఆర్ గార్డెన్లో గురువారం జరిగిన బీఆర్ఎస్ 4,5,6,8 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ కార్యకర్తలు, ప్రజలను మరిచిపోనని చెప్పారు.
హనుమకొండ సిటీ, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్ నాలుగో డివిజన్ పెద్దమ్మగడ్డలోని ఆర్ఆర్ గార్డెన్లో గురువారం బీఆర్ఎస్ 4,5,6,8 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. సీఎం కేసీఆర్ సందేశాన్ని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ చదివి వినిపించారు. ముఖ్యఅతిథిగా పల్లా రాజేశ్వర్రెడ్డి హాజ రై మాట్లాడుతూ కరంటు, సాగునీటిని సమృద్ధిగా అందిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజల మనస్సును గెలుచుకుందని వివరించా రు. కల్యాణలక్ష్మి పేరిట ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నది దేశంలో ఒకే ఒక సీఎం కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేని విపక్షాలు బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వారి కుట్రలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. పదో తరగతి హిం దీ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పోలీసులు జైలుకు తరలించినట్లు చెప్పారు. విద్యార్థులు, యువత భవిష్యత్తో బీజేపీ ఆటలాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం 41 వేల పోలీసుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని, త్వరలో 15 వేల ఉ ద్యోగాలకు సంబంధించిన ఫలితాలు రానున్నట్లు ఎమ్మెల్సీ పల్లా వెల్లడించారు. అదేవిధంగా ప్రైవేట్, ఐటీ రంగాల్లో సై తం ఉపాధి అవకాశాలు కల్పన యజ్ఞం లా కొనసాగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతుల ను ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నిక లు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాల తోడేళ్ల గుంపులు గ్రామాలు, కాలనీలపై పడే ప్రమాదం ఉందని, అలాంటి వారిని రానివ్వకుండా అడ్డుకోవాలని కోరారు. తలలో నాలుకలా ఉండే ఎమ్మెల్యే వినయ్భాస్కర్ను రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల అగ్నిపరీక్షలో ప్రజలే కీలకంగా అక్కున చేర్చుకొని గెలిపించుకుంటున్నారని ప్రభుత్వ చీప్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ ప్రజలు, కార్యకర్తలను మరిచిపోనన్నా రు. తెలంగాణ ఉద్యమంతోపాటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం పని చేసినట్లు వివరించారు. 2009లో గెలిపించినా ప్రజలకు ఏమి చేయలేకపోయాననే అసంతృప్తి ఉండేదన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, సీఎం కేసీఆర్ను ఒప్పించి నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వం స్థలాల్లో గుడిసెలు నిర్మిస్తే రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చేవాళ్లన్నారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన 58,59 జీవోలతో పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టే వారిని కాలనీల్లోకి రానివ్వకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అమలవుతున్నాయా అని వారిని నిలదీయాలన్నారు. రాష్ట్రంలో మరిన్ని పథకాలను అమలు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వివరించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు వినయ్భాస్కర్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్, కార్పొరేటర్లు చెన్నం మధు, బొంగు అశోక్యాదవ్, మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు, నలుబోల సతీశ్, ఆయా డివిజన్ల అధ్యక్షులు కంజర్ల మనోజ్, పున్నంచందర్, మడిపల్లి సుమన్గౌడ్, పులి విక్రం, నాయకులు చింతాకుల ప్రభాకర్, నారాయణగిరి రాజు, శ్యాంసుందర్, వీరేందర్, జోరిక రమేశ్, వెన్ను కొండయ్య పాల్గొన్నారు.