స్టేషన్ ఘన్పూర్, ఆక్టోబర్ 3: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ఈఆర్ఎల్ గార్డెన్లో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, విశిష్ట అతిథిగా రెడ్కో చైర్మన్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీహరి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కొన్ని తండాలు, గ్రామాల్లో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికే ఓటు వేయాలని తీర్మానం చేసుకున్నారని తెలిపారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టడంలో ముందుండాలన్నారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని ప్రతి ఇంటా ప్రచారం చేయాలన్నారు. రానున్న రెండు నెలలు సోషల్ మీడియా వారియర్స్ కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసే సోషల్ మీడియా వారియర్స్ను సంక్షేమ పథకాలు అందించి ఆదుకుంటానని, యువతపై వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.
అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి : సతీశ్రెడ్డి
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సహకరించని కాంగ్రెస్, నిధులు కేటాయించని బీజేపీలు అస త్య ప్రచారాలతో ప్రజలను నమ్మించి ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తున్నాయని, ఆయా పార్టీలు చేసే అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సోషల్ మీడియా వారియర్స్కు సతీశ్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ బ్రేకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలను ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తూ వారికి అవగాహన కల్పించారు. అలాగే ఇతర పత్రికలు, చానల్స్ జరిగిన సంఘనటనకు విరుద్ధంగా ప్రచురిస్తున్నాయని, అసత్య ప్రచారాలాను తిప్పి కొడుతూనే, ఫేక్ న్యూస్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు నెలలు కష్టపడాలని, ఎన్నికల అనంతరం వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, రాజేశ్ నాయక్, ఎంపీటీసీ రజాక్యాదవ్, సర్పంచులు కోతి రేణుకా రాములు, ఎర్రబెల్లి శరత్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి రంగు రమేశ్, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, కడియం యువసేన సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ హఫీజ్, కడియం యువసేన స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్ఘడ్, రఘునాథపల్లి, వేలేరు మండలాల అధ్యక్షులు జీడీ ప్రసాద్, ఇల్లందుల విజయ్, వడ్లకొండ శివప్రసాద్, నర్సింహ, అనుదీప్, కడియం యువసేన ప్రధాన కార్యదర్శి సౌదరపల్లి సంపత్రాజ్, ఉపాధ్యక్షుడు పల్లె శ్రీనివాస్, బూర్ల రాజు, కట్ల అఖిల్, కొర్రె వెంకటేశ్ నాయక్