స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 8: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ను శుక్రవారం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్ధి కడియం శ్రీహరి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విదేశి పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన కేటీఆర్ను కడియం శ్రీహరి కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
విదేశీ పర్యటన విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్లో రాజకీయ పరిణామాలపై కేటీఆర్ ఎమ్మెల్సీ కడియంను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.