చిల్పూరు, జూలై 25 : రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో భాగంగా నష్కల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.4 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పత్రాలను సోమవారం మాజీ ఎంపీపీ వంగాల జగన్మోహన్రెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ పోరా డి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే యాదాద్రిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని రెండో తిరుపతిగా తీర్చిదిద్దారని కడియం శ్రీహరి వివరించారు.
జిల్లాలోని పురాతన ఆలయాలను మరమ్మతులు చేయడంతోపాటు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం మరిన్ని నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, మాజీ ఎంపీపీ వంగాల జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ కర్నెకంటి స్వప్నావెంకటేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జనగామ యాదగిరి, సాగునీటి సాధన కమిటీ కన్వీనర్ కేశిరెడ్డి మనోజ్రెడ్డి, చిల్పూరు, లింగంపల్లి, ఫత్తేపూర్త, గార్లగడ్డతండా, వెంకటాద్రిపేట సర్పంచ్లు ఉద్దెమారి రాజ్కుమార్, ఏదునూరి రవీందర్, రూప్లానాయక్, తులసి, కందుల రఘపతి, కృష్ణాజిగూడెం ఎంపీటీసీ సాదం నర్సింహులు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అరూరి స్వామి, నాయకులు మోడం మొగిలి, వండ్లకొండ శంకర్, రాజిరెడ్డి పాల్గొన్నారు.