వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకంతో యావత్ తెలంగాణ రైతులు భరోసాగా బతుకుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 31 మంది రైతు కుటుంబాలకు రూ. 1.55 కోట్ల విలువైన ‘రైతుబీమా’ చెక్కులను నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ..దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మరణం పొందితే వారిపై ఆధార పడిన కుటుంబం రోడ్డున పడుతుందన్నారు.
రైతు బతికున్నప్పుడు ఎంత గౌరవంగా బతికారో యజమాని చనిపోయాక కూడా అంతే గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల ప్రమాద బీమాని యావత్ ప్రపంచం మెచ్చే విధంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. ఇప్పటి వరకు 35 కోట్ల 75 లక్షల రూపాలయలను నర్సంపేట నియోజకవర్గంలో అకాల మరణం పొందిన 715 మంది రైతుల కుటుంబాలకు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలియజేశారు.