నల్లబెల్లి, 29 : సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న సహకార సంఘ భవన సముదాయ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నాబార్డు నిధులు రూ.కోటీ 90లక్షలతో మండల కేంద్రంలో సహకార సంఘ భవన నిర్మాణంతోపాటు గోదాముల నిర్మించనున్నట్లు తెలిపారు. బోల్లోనిపల్లిలో రూ.కోటీ 12లక్షల వ్యయంతో 1500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాం నిర్మాణం, మేడెపల్లి, గుండ్లపహాడ్ గ్రామాల్లో రూ.44లక్షలతో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్యం గల గోదాముల నిర్మాణం, రూ.31లక్షల వ్యయంతో మండల కేంద్రంలో సహకార సంఘం నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో పీఏసీఎస్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రధానంగా అన్నదాతల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని చెప్పారు. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు రాకున్నా చివరి గింజా కొనుగోలుకు సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మక్కలు కొనుగోలుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చిందన్నారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ మురళీధర్రావు, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, సర్పంచ్ నానెబోయిన రాజారాం, సీఈవో నాగెల్లి మొగిళి పాల్గొన్నారు.
కంఠమహేశ్వరుడి దీవెనలు అందరిపై ఉండాలి
కంఠమహేశ్వరుడి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని లెంకాలపల్లి గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. కంఠమహేశ్వరుడి విగ్రహదాత ఏరుకొం ముణీశ్వర్ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గీతకార్మికుల కోస పింఛన్తోపాటు కులవృత్తుల వారికి చెల్లించేలా గౌడలకు రూ.లక్ష మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. గీతకార్మికులకు ప్రమాద బీమా రూ.5లక్షలు ప్రకటించారని పేర్కొన్నారు. నియోజకవర్గం కేంద్రాల్లో నీరా సెంటర్ ఏర్పాటు చేసి గౌడల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎంపీపీ ఊడుగుల సునిత, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, ప్రధాన కార్యదర్శి కొత్తపెల్లి కోటిలింగాచారి, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా, ఉప సర్పంచ్ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ గడ్డమీది రత్నాకర్, సర్పంచ్ ఊరటి అమరేందర్రెడ్డి, మోహన్రెడ్డి, గన్నెబోయిన చేరాలు, ఏరుకొండ సదయ్య పాల్గొన్నారు.