నర్సంపేటరూరల్, మే 19: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.8.01కోట్లతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామాన్ని బీటీ రోడ్లతో అనుసంధానం చేస్తామన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, తద్వారా వ్యాపార, రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రయాణం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ జరుగుతున్నదన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, నిర్ణీత సమయంలోనే ప్రజలకు అందుబాటులోకి తీసురావాలని కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ హేమలత, డీఈ రాంరెడ్డి, ఏఈ చందర్రావు, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు మురాల మోహన్రెడ్డి, ఆకుల రమేశ్గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భూక్యా వీరన్న, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొడారి రవన్న, సర్పంచ్లు బొజ్జ యువరాజ్, బరిగెల లావణ్య, వల్గుబెల్లి రంగారెడ్డి, భూక్యా వీరన్న, మొలుగూరి చంద్రమౌళి, మండల రవీందర్, గోలి శ్రీనివాస్రెడ్డి, గొడిశాల మమత, తుత్తూరు కోమల, కవిత, ఎంపీటీసీలు పెద్ది శ్రీనివాస్రెడ్డి, లలిత, వల్గుబెల్లి విజయ, వీరన్న, బండారు శ్రీలత, బీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్, మారపాక కుమారస్వామి, క్లస్టర్ బాధ్యులు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, మోటూరి రవి, తాళ్లపల్లి రాంప్రసాద్, భూక్యా వీరన్ననాయక్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని చంద్రయ్యపల్లి, చక్రంతండాలో శుక్రవారం 25మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కమ్మపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చక్రంతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు అజ్మీరా రాజు, అజ్మీరా రవి, అజ్మీరా స్వామి, అజ్మీరా నరేశ్, వంశీ, భద్రుతో పాటు మరో 10మంది బీఆర్ఎస్లో చేరారు. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల వినయ్తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరా రు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో జర్పుల వీరన్న, చిలువేరు శ్రీనివాస్, ఉప్పుల రాజు, బరిగెల కిశోర్ పాల్గొన్నారు.
ఉద్యోగస్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. వీఆర్ఏల సంఘం (బీఆర్టీయూ అనుబంధం) ఆధ్వర్యంలో పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగ, కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వారి వేతనాలు పెంచారన్నారు. ఎలక్ట్రిసిటీ, విద్య, వైద్య రంగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేశారని తెలిపారు. తాజాగా వీఆర్ఏలను రెగ్యులర్ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు రాజులపాటి అశోక్, జిల్లా అధ్యక్షుడు ఐలేశ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, జిల్లా నాయకుడు రాజేశ్, డివిజన్ అధ్యక్షులు గోనె యువరాజ్, శీలం రాజు పాల్గొన్నారు.