నర్సంపేట, జనవరి 16: నియోజకవర్గంలో వరద ప్రవాహానికి దెబ్బతిన్న 74 పీఆర్ రోడ్ల మరమ్మతుకు రూ.63.88కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో నియోజకవర్గంలో 118 కిలోమీటర్ల రోడ్ల నిర్మించనున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గత జనవరిలో వడగళ్ల వానతో నియోజకవర్గంలో సుమారు 18,500 మంది రైతులు 18వేల ఎకరాల్లో పంట నష్టపోయారని తెలిపారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. రైతులను కాపాడేందుకు నష్టపోయిన మిర్చి, మక్కజొన్న పంటలకు సంబంధించి ఇన్ఫుట్ సబ్సిడీ విడుదల చేసినట్లు తెలిపారు.
మరో వారంలో చెక్కులను రైతువేదికల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇంటర్నల్ రోడ్లు, ఎక్సటర్నల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వానికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో సీఎం కార్యాలయానికి వేర్వేరుగా నివేదికలను పంపినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీవో నంబర్ 35 ద్వారా మంత్రి ఎర్రబెల్లి 74రోడ్ల మరమ్మతులకు రూ.63.88కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అందులో రూ.36కోట్లు బీటీ రోడ్లకు, రూ.27.50కోట్లు సీసీ రోడ్లకు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులకు వారంలో టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన నాలుగు నెలలో పూర్తి చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి, తండాకు బీటీ రోడ్డు వేస్తామని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు జీవో ప్రకారం పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. హెక్టార్కు రూ.13,500, ఎకరాకు రూ.5,400 చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. అదనంగా రైతులందరికీ మోటర్లకు ఉపయోగపడే పీవీసీ పైపు 400 మీటర్ల యూనిట్ కాస్ట్ రూ.30వేల అందులో రూ.15వేలు సబ్సిడీ అందిస్తుందన్నారు. మిగతా రూ.15వేలు రైతు చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పైలెట్ ప్రాజెక్టును త్వరలోనే మంజూరు చేయిస్తామని అన్నారు. ఈనెల18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అందరూ తరలిరావాలని కోరారు.
జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బీరం సంజీవరెడ్డి, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, రైతుబంధు సమితి రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నల్లా మనోహర్రెడ్డి, ఎంపీపీ వేములపెల్లి ప్రకాశ్రావు, గుంటికిషన్, మునిగాలవెంకట్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు పత్తినాయక్, దార్ల రమాదేవి, మోతె పద్మనాభరెడ్డి, రఫీ, బుర్రి తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. నర్సంపేటకు చెందిన దర్శకుడు కంజర్ల సందీప్ భూమికి జై’ పోస్టర్ ఆవిష్కరణను ఎమ్మెల్యే పెద్ది ఆవిష్కరించారు. నూతన నటీ నటులతో జాశ్నవి మూవీ మేకర్స్ నిర్మించినట్లు తెలుసుకొని అభినందించారు. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, శానబోయిన రాజ్కుమార్, కల్లెపెల్లి సురేష్, ఎస్ఎస్ రాజు, సిలువేరు సుధాకర్, పవన్, అరవింద్, వినయ్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: క్యాంప్ కార్యాలయంలో మండలంలోని మాధన్నపేటకు చెందిన బీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్ ఆధ్వర్యంలో ఆదివారం భారత జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ (బీజేఎస్ఎఫ్) క్యాలెండర్ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆవిష్కరించారు. ముదిరాజ్ మహాసభ ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్కుమార్, తాడు డివిజన్ అధ్యక్షుడు కళ్లెపెల్లి సురేష్, బీఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్, సౌడరపు మధు, బీజేఎస్ఎఫ్ నియోజకవర్గ బాధ్యులు ప్రవీణ్, రాజు, రవీందర్, సురేష్, సంతోష్, క్రాంతి, అఖిల్, నాగరాజు, సందీప్, విజయ్, రాకేష్, మోహన్రావు, బాలకృష్ణ ఉన్నారు.
చెన్నారావుపేట: మండలంలోని అమృతండా జీపీ పరిధిలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హాజరై మాట్లాడారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కాగా, మండలంలోని లింగగిరి గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవ జాతర జరిగింది. నాలుగో రోజైన సోమవారం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం మహాజాతరలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దర్శించుకొని పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి రూ.50లక్షల సీసీ రోడ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏసీపీ సంపత్రావు ఆధ్వర్యంలోని సీఐ హతీరాం, ఎస్సై తోట మహేందర్ బారీ బందోబస్తు నిర్వహించారు. ఎంపీపీ విజేందర్, జడ్పీటీసీ పత్తినాయక్, అమినాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, జడ్పీ కోఆప్షన్ రఫీ, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, సర్పంచ్ మాదారపు భాస్కర్, మండల యువ నాయకుడు కృష్ణచైతన్య పాల్గొన్నారు.
నల్లబెల్లి: కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదరన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. కంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మండలంలోని 29 జీపీల్లో 100 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దృష్టి లోపం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, సర్పంచులు ఎన్.రాజారాం, గోనె శ్రీదేవి, మల్లాడి సిద్దూరి రత్నాకర్రావు, గందె శ్రీనివాస్గుప్తా పాల్గొన్నారు..