నర్సంపేటరూరల్, మే 24: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదల పాలిట వరమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 74మందికి రూ.74లక్షల 8వేల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళల అభ్యు న్నతికి పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పా రు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీపీలు మోతె కళావతి, వేములపల్లి ప్రకాశ్రావు పాల్గొన్నారు.
రాజరాజేశ్వరాలయ అభివృద్ధికి కృషి
నల్లబెల్లి: రాజరాజేశ్వరాలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో నిర్మించిన శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో శివాలయం నిర్మాణానికి కృషి చేసిన స్థల దాత, ఆలయ కమిటీ చైర్మన్ తాటిపెల్లి వెంకటయ్యను అభినందించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి రూ. 3 లక్షల విరా ళం అందజేశారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా రెండో రోజు వేదపండితుడు గంగాప్రసాద్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ ఎన్ రాజారాం ఏర్పాట్లు చేశారు.
భక్తిభావంతో మానసిక ప్రశాంతత
ఖానాపురం: భక్తిభావంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో పుష్కర బ్రహ్మాత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది హాజరు కాగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సీతారామచంద్రులకు పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, కుంచారపు వెంకట్రెడ్డి, బొప్పిడి పూర్ణచందర్, గోనుగుంట్ల పెద్దారావు, గొల్లపూడి సుబ్బారావు, వేజళ్ల కిషన్రావు పాల్గొన్నారు.