నర్సంపేట, మార్చి 17 : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ స్టడీ టూర్కు వెళ్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మహారాష్ట్రలో ఈనెల 18,19,20 తేదీల్లో పర్యటించనున్నారు. నూతన సాగు విధానాలు, సాంకేతిక పద్ధతులు, పంటల మార్పిడి, ఆయిల్పామ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, రైతుల ఉత్పత్తి సంఘాలు(ఎఫ్పీవో) తదితర అంశాలపై స్టడీ చేయనున్నారు. వీరితో పాటు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వెళ్లనున్నారు. రైతన్న శ్రేయస్సు కోసం సీఎం కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులను వ్యవసాయ స్టడీ టూర్కు పంపిస్తున్నారు.