కరీమాబాద్, జనవరి 19 : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగుతో ప్రతి ఇంటిలో వెలుగులు నిండుతాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 2వ విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ఉర్సు సీఆర్సీ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చూపు మందగించినా దవాఖానకు పోలేక ఇబ్బంది పడుతున్న పేదలు, వృద్ధులను ఆదుకోవాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
అవసరమైన వారందరికీ శస్త్రచికిత్సతో పాటు కంటి అద్దాలను అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కంటివెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రవి, పోశాల పద్మ, సిద్దం రాజు, బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, గుండేటి నరేందర్, కావటి కవిత, బాలిన సురేశ్, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, పల్లం రవి, 40వ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్ తదితరులు పాల్గొన్నారు.